ఈ మధ్యకాలంలో తాళికి తాడుకు తేడా లేకుండా పోతుంది. పెళ్లి చేసుకునే సమయంలో పసుపుతాడును కడుతున్నామని సృహ లేకుండా ఊరితాడు కడుతున్నామనే భావనలో ఉంటున్నారెమో ఈ మొగుళ్లు అనే మొసళ్లు. అదును చూసి ఆడవాళ్లకు అన్యాయం చేస్తున్నారు.

 

 

ఏమైన అంటే చంపేస్తున్నారు. చట్టం ఇలాంటి వాళ్లకు ఎన్ని శిక్షలు విధించిన వారిలో మార్పు రావడం లేదు. పైగా ఇంకా రెచ్చిపోతున్నారు. ఇక మరి కొందరికి అనుమానం అనే భూతం ఆవహించి తాను ఏం చేస్తున్నాడో తెలుసుకునే స్దితిలో ఉండటం లేదు. ఇదిగో ఇక్కడ ఓ మృగం కూడా మతిస్దిమితం కోల్పోయిన కుక్కలా ప్రవర్తించింది. అతను భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని ఆమె కాళ్లు, చేతులు నరికేశాడు.

 

 

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెకు వైద్యం చేస్తున్నారు. ఇక దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గంగాధర నెల్లూరు మండలం ఆరుమాకులపల్లి గ్రామానికి చెందిన సతీష్‌కు నాగమ్మ అనే మహిళతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే సతీశ్ భార్యను అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడట. ఇక ఆమె ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు.

 

 

ఈ విషయంలో చాలారోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనిపై పెద్దల మధ్య పంచాయతీ జరిగినా ఈ వివాదం ముగిసిపోలేదు. ఈ క్రమంలో మరోసారి జరిగిన గొడవ తీవ్ర స్దాయికి చేరడంతో కోపోద్రిక్తుడైన సతీష్  కత్తితో భార్య కాళ్లు, చేతులు నరికేశాడు.

 

 

బాధితురాలి కేకలు విన్న స్థానికులు, బంధువులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారట. ఇక ఘటనపై సమాచారం అందుకున్న గంగాధర నెల్లూరు పోలీసులు సతీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: