ఎంతటి వారైనా కాలానికి తలొంచక తప్పదన్న విషయం చాలాసార్లే రుజువైంది. అదే విషయం చంద్రబాబునాయుడు విషయంలో కూడా  తాజాగా నిరూపితమైంది. దాంతో పాపం చంద్రబాబుకు నిద్రకూడా సరిగా పట్టటం లేదని సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే  ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మరోవైపు నరేంద్రమోడి ఇద్దరూ కలిసి ఈ మాజీ సిఎంను ఓ ఆటాడేసుకుంటున్నారు.

 

కేసుల బూచిని చూపి నరేంద్రమోడి, అవినీతి వ్యవహారాలపై విచారణ పేరుతో జగన్ తీసుకుంటున్న చర్యలతో చంద్రబాబు చాలా ఇబ్బంది పడుతున్నది వాస్తవం. అధికారంలో ఉన్నంత కాలం ఆకాశమే హద్దుగా చంద్రబాబు అవినీతితో రెచ్చిపోయారు. ఆయన్ను చూసి మిగిలిన మంత్రులు, నేతలు కూడా అందినకాడికి దోచేసుకున్నారు. అయితే ఊహించనిరీతిలో జగన్ అధికారంలోకి రావటంతో మొత్తం వ్యవహారాలను విచారణల పేరుతో తిరగతోడుతున్నారు.

 

ఇదే సమయంలో  ఆదాయపు పన్ను ఉన్నతాధికారులు నిర్వహించిన దాడుల్లో  ఓ కీలక విషయం బయటపడింది.  అమరావతిలో కాంట్రాక్టు పనులు చేసిన ఓ కంపెనీ నుండి  ఓ ప్రముఖుడికి రూ. 150 కోట్లు ముడుపులు ముట్టాయని ఆధారాలతో సహా ఓ ఫైల్ దొరికింది. అదికూడా కంపెనీపై జరిపిన దాడి సమయంలోనే లెక్కలతో సహా దొరకటం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఐటి ఉన్నతాధికారే అధికారికంగా ప్రకటించటం మరింత సంచలనమైంది.

 

సరే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆ రూ. 150 కోట్లు ముడుపులందుకున్న ముఖ్యనేత ఎవరన్న విషయాన్ని ఎవరికి వారుగా ఊహించేసుకోవచ్చు. ఇపుడా ఫైల్ పట్టుకుని మొత్తం టిడిపిని బిజెపిలో కలిపేసుకోవటానికి కొందరు పార్టీ పెద్దలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

 

ఎప్పటికైనా తెలుగుదేశంపార్టీని కమలం పార్టీలో కలిపేయక తప్పదన్న ధీమాతోనే రాష్ట్రంలోని బిజెపి నేతలు విలీనం గురించి తరచూ ప్రస్తావిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఒకవేళ కమలంపార్టీ నేతలకు ఎదురుతిరిగితే తనకు పట్టబోయే గతేమిటో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే ఇటు  విలీనం చేయలేక అటు ఎదురుతిరగలేక నానా అవస్తలు పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: