స‌మాజంలో పెరిగిపోతున్న భావోద్వేగాల స‌మ‌స్య‌ల‌కు, ఆవేశాల‌కు మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. ఒళ్లు గ‌గుర్పాటు క‌లిగించే దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న ఇది. అనుమానం పెనుభూత‌మైన ఘ‌ట‌న ఫ‌లితం ఇది. త‌న భార్యపై అనుమానంతో కాళ్లు, చేతులు నరికేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా  గంగాధర నెల్లూరు మండలం ఆరుమాకులపల్లిలో చోటు చేసుకుంది. గంగాధర నెల్లూరు మండలం ఆరిమాకులపల్లి గ్రామంలో భార్య కాపురానికి రావ‌డం లేదని ఆగ్రహించిన భర్త కత్తితో ఆమె రెండు కాళ్లు నరికి పరారయ్యాడు.

 

పోలీసులు, ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నం ప్ర‌కారం... ఆరుమాకులపల్లికి చెందిన సతీశ్, నాగమ్మ భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల క్రితం పెళ్లైంది. ఏడాది, ఆరునెలలు వయస్సు కలిగిన ఇద్దరు కుమారులు ఉన్నారు. కార‌ణాలు స్ప‌ష్టంగా తెలియ‌వు కానీ..భార్య నాగమ్మపై సతీశ్ అనుమానం పెంచుకున్నాడు. . ఆమె ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు. దీంతో చాలారోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనిపై పెద్దల మధ్య పంచాయతీ జరిగినా వివాదం సద్దుమణగలేదు. తాజాగా ఆదివారం ఆమెకు హానీ పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడు. భార్యపై కత్తితో దాడి చేసి ఆమె కాళ్లు, చేతులు నరికి వేసి అక్క‌డి నుంచి పారిపోయాడు.రక్తపు మడుగులో ఉన్న నాగమ్మను స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

అయితే, నాగ‌మ్మ‌ను ప‌రీక్షించిన వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఆమె కాళ్లకు తీవ్రస్థాయిలో గాయాలు అయ్యాయని, చేతులు, కాళ్లకు సంబంధించిన నరాలు పూర్తిగా తెగి పోయాయని తేల్చారు. మెరుగైన వైద్యం కోసం తమిళనాడు వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు దవాఖానకు చేరుకొని బాధితురాలి వాంగ్మూలం తీసుకొని దర్యాప్తుచేపట్టారు. 

 

కాగా, పోలీసుల అదుపులో ఉన్న సతీష్ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. త‌న భార్య చెడు అలవాట్లకు బానిస‌గా మారింద‌ని ఆరోపించాడు. ``ఆమె నా మాట వినడం లేదు. వ్యవహారాన్ని మార్చుకుని బుద్ధిగా ఉండాలని చెప్పినా ప‌ట్టించుకోలేదు. నన్ను, పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ ..అమ్మగారి ఇంట్లోనే ఉంటుంది...కాపురానికి రావడం లేదు. అందుకే కత్తి తీసుకుని నరికివేశాను’ అని చెప్పాడు. దీంతో షాక్ తిన‌డం పోలీసుల వంతు అయింద‌.ఇ

మరింత సమాచారం తెలుసుకోండి: