వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై.. అతని సుపుత్రుడు నారాలోకేష్ మరోసారి భారీ స్థాయిలో ట్విట్టర్ వేధికగా విరుచుకుపడ్డడు. ఎప్పుడు ప్రతిపక్షాలపై జోకులు వేసే విజయసాయి రెడ్డి ఈసారి వేసిన జోకులు చూస్తే కడుపు ఉబ్బిపోయేలా నవ్వుతారు. లోకేష్ ని మరోసారి పప్పు అని, మాలోకం అని కామెడీ చేశారు విజయసాయి రెడ్డి. 

 

వైఎస్ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేష్ వారి పచ్చ మీడియా చెప్పలేనన్ని కుట్రలు చేశారు.. కానీ ఇప్పుడు వారికీ ప్రతిపక్ష హోదా కూడా ఉండేలా కనిపించట్లేదు అని అనగా నిశ్చితార్దానికి, పెళ్ళికి కూడా తేడా తెలియదు సుంటపప్పు లోకేష్ కి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

 

విజయసాయి రెడ్డి లోకేష్ ని ఉద్దేశిస్తూ 'తెలుగు ఉద్యమకారుడి అవతారం ఎత్తిన మాలోకానికి నిశ్చితార్థానికి, పెళ్లికి తేడా తెలియట్లేదు. గతంలో జయంతికి వర్ధంతికి బేధం తెలియకుండా మాట్లాడి అభాసుపాలయ్యాడు. మంగళగిరిలో చిత్తుగా ఓడినా ఏ మాత్రం తగ్గకుండా కామెడీ పండించడంలో జోరు కొనసాగిస్తున్నాడు'అంటూ సెటైర్లు పేల్చారు.       

 

మరో వైపు చంద్రబాబును ఉద్దేశిస్తూ 'ఐదు నెలల్లోనే ఎన్ని అబద్ధాలు, పుకార్లు ప్రచారం చేయాలో అన్నీ చేశారు. ఎల్లో మీడియా రేయింబవళ్ళు గింజుకుంటున్నా వారి కుయుక్తులను ప్రజలు పసిగట్టేశారు. దోపిడీ పాలన పోయినందుకు సంతోషంగా ఉన్నారు. ఇంకా నాలుగున్నరేళ్లు ఎలా తట్టుకుంటారో చంద్రబాబు దొంగల బ్యాచ్'అని, 

 

'వచ్చే ఆరు నెలల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన చూస్తుంటే ఐదారుగురైనా మిగిలేది అనుమానమే. నారా లోకేష్ రెండోసారి ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండక పోవచ్చు. కేసులైనా తప్పించుకోవచ్చని బీజేపీ చంక ఎక్కడానికి చూస్తున్నారు' అంటూ ఘాటు ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి: