గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  అంటే ఇపుడు అందరికీ తెలిసిపోయింది. ఆయన టీడీపీని మీడియా సాక్షిగా చాకిరేవు పెట్టిన సంగతి కూడా విధితమే. చంద్రబాబుని జీవితంలో ఎవరూ అనని మాటలను అన్న వంశీ లోకేష్ పార్టీని ముంచేస్తాడంటూ హాట్ కామెంట్స్ చేశారు.  వైసీపీ అధినేత జగన్ని  కలసి చర్చలు జరిపిన వంశీ వైసీపీలో చేరుతాడని అంతా అనుకుంటున్న వేళ కాదు ఆయన బీజేపీ వైపే అంటున్నారు.

 

ఈ మాటలు అన్నది కూడా ఎవరో కాదు, వంశీకి సన్నిహితుడు, ఓ విధంగా బంధువు కూడా అయిన సుజనా చౌదరి. తనకు తెలిసి వంశీ వైసీపీలో చేరడని అంటూ   సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. పైగా వంశీ చాలా తెలివైన వాడని, తప్పుడు నిర్ణయం తీసుకోరని కూడా ఆయన అంటున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తరువాత కూడా తనతో మాట్లాడిన వంశీ ఇప్పటికీ వైసీపీలో చేరలేదు కదా అని ఆయన గుర్తు చేస్తున్నారు.

 

వంశీ సరైన సమయంలో జాతీయ పార్టీలోనే చేరుతారని సుజన అంటున్నారు. అంటే వంశీ బీజేపీలో చేరడం ఖాయమని ఆయన చెప్పకనే చెప్పేస్తున్నారు. మరో వైపు వంశీ వైసీపీ నేతలతో టచ్ లో ఉంటూ వస్తున్నారు. ఆయన చేరడం ఖాయమని కూడా ఆ పార్టీలో అంటున్నారు. వంశీ కనుక చేరితే గన్నవరం నియోజకవర్గం ఇంచార్జి యార్లగడ్డ వెంకటరావుని ఎమ్మెల్సీ చేస్తారని కూడా చెబుతున్నారు. మరి సుజనా చౌదరి మాత్రం ఎప్పటికీ వంశీ వైసీపీలో చేరడంటూ నమ్మకంగా చెబుతున్నారు. మొత్తానికి సుజనా చౌదరి మాట్లౌ వింటూంటే వంశీ డబుల్ గేం ఆడుతున్నారా అన్న డౌట్లు పుట్టుకొస్తున్నాయి. 

 

చూడాలి మరి ఏపీలో అటు వైసీపీ, ఇటు బీజేపీ కూడా ఎమ్మెల్యేల వేట మొదలుపెట్టాయి. మరి ఈ రెండు పార్టీల ఆపరేషన్ కి ఎవరు చిక్కుతారో. ఏపీ రాజకీయాల్లో ఇపుడు ఇది హాట్ టాపిక్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: