తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుండి ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈరోజు కొత్తగా మేమొక చట్టం తీసుకొనిరాలేదని గతంలో ఉన్నవాటినే మేము కొనసాగిస్తున్నామని మల్లాదివిష్ణు చెప్పారు. ప్రభుత్వ ఆదాయంలో దేవాలయాల నుండి తీసుకునే దాని కన్నా ప్రభుత్వమే ఎక్కువగా నిధులను ఖర్చు పెడుతోందని మల్లాది విష్ణు చెప్పారు. మల్లాది విష్ణు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మీకు తెలియకపోతే మీ దత్తత తండ్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగి తెలుసుకోండని మల్లాది విష్ణు అన్నారు. 
 
ఐరోపా వెళితే ఒకటి, హైదరాబాద్ వెళ్తే ఒకటి, విజయవాడ వెళ్తే ఒకటి పవన్ కళ్యాణ్ మాట్లాడతారని మల్లాది విష్ణు అన్నారు. రకరకాలుగా పవన్ కళ్యాణ్ మాట్లాడి ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసే విధంగా చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మల్లాది విష్ణు అన్నారు. దేవాలయాల నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మల్లాది విష్ణు చెప్పారు. 
 
పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన ఒక ఆడియోను వినిపించి ఇదీ పవన్ అసలు రంగు అని మల్లాది విష్ణు అన్నారు. ఒక పిచ్చివాడిలాగా, ఒక ఉన్మాదిలాగా, ఒక అరాచక వాదిలాగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. ఈ రాష్ట్రంలో సమాజాన్ని చీల్చాలనే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని అన్నారు. రెండు చోట్ల ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదంటే మీ గురించి అజ్ఞానులు అని మాట్లాడుకోవాలని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మల్లాది విష్ణు అన్నారు. 
 
అజ్ఞానులకు ఎంత చెప్పినా అర్థమయ్యే పరిస్థితి ఉండదని మల్లాది విష్ణు అన్నారు. ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరును డైవర్ట్ చేయటం కోసం కులాలు, మతాలుగా విడగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీలికలు తీసుకొనిరావటానికి ప్రయత్నం చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. అందరి మనోభావాలు దెబ్బ తీసే విధంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: