ఏపీ రాజధాని పై రగులుతున్న రగడకు ఇక తెరపడ్డట్లేననే అని అనుకుంటున్నారు ప్రజలు. మొన్నటికి మొన్న అమరావతి లేకుండా కేంద్రం ఇండియా మ్యాప్‌ను విడుదల చేసింది. ఆంధ్ర రాజధాని లేకుండా మ్యాప్ విడుదల చేయడం పట్ల టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పార్లమెంట్‌లో అభ్యంతరం వ్యక్తం చేయగా. ఆ మరుసటి రోజే.. కేంద్రం అమరావతితో కూడిన భారత మ్యాప్‌ను రిలీజ్ చేసింది. దీంతో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా భారత సర్కారు గుర్తించినట్టయ్యింది.

 

 

ఇక ఇప్పుడు జగన్ సర్కారు అమరావతి విషయమై సానుకూల ధోరణిని వ్యక్తం చేసింది. సోమవారం రాత్రి సీఆర్డీఏపై సమీక్ష జరిపిన సీఎం జగన్ అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న పనులను తిరిగి కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నిర్మాణ పనులకు గాను ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా  ఇచ్చారు. అంతే కాకుండా సీఆర్డీఏ పరిధిలోని పనులను సాధ్యమైనంత త్వరగా, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇదే గాకుండా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని సీఎం నిర్ణయించారు..

 

 

ఇక్జపోతే పోలవరం ప్రాజెక్టు పనులపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన జగన్ సర్కారు, అమరావతి విషయంలోనూ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించింది. ఇక సీఆర్డీఏ పరిధిలో ప్లానింగ్‌ పొరబాట్లు ఉండొద్దని ఈ సందర్భంగా ఆదేశించారు. అదీ గాకుండా ఇప్పటి వరకూ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చాకే నిర్ణయం తీసుకుంటామన్న జగన్ సర్కారు.. తాజాగా అమరావతి భవనాల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పడం గమనార్హం.

 

 

అమరావతిలో ప్రకటించిన తొలి ప్రజానివాస సముదాయం హ్యాపీనెస్ట్‌. ఈ ప్రాజెక్టును ప్రకటించిన కొద్ది గంటల్లోనే 1,200 ఫ్లాట్లు బుక్‌ అయ్యాయి. వీటిని నేలపాడు వద్ద 12 టవర్లుగా నిర్మించనున్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కాంట్రాక్టును గత ప్రభుత్వం షాపూర్ జీ-పల్లోంజీ గ్రూప్‌కి అప్పగించింది. ఈ ప్రాజెక్టుకు రివర్స్ టెండర్ల కోసం జగన్ సర్కారు తాజాగా ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: