భార్య అంటే ఎంతో ఇష్టం.. ఎంతో ప్రేమ అందుకే ఆమె లేకుంటే జీవితం లేదనుకున్నాడు... అందుకే భార్య ఇంకా దూరం అవ్వకనే దూరం అవుతుంది ఏమో అని .. తనను వదిలి వెళ్ళిపోతుంది ఏమో అని మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ భర్త.. ఈ ఘటన మల్కాజిగిరి పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఆనంద్‌బాగ్‌లో జరిగింది. 

                                                 

ఇంకా వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన పల్లె ఆంజనేయులు కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి కోరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. రామచంద్ర అపార్టుమెంట్‌లో ఉంటున్నాడు. పదిరోజుల క్రితం భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది దీంతో అప్పటి నుండి భర్త బాధపడుతున్నాడు. 

                                                                  

ఆదివారం ఆమె వచ్చి తన దుస్తులు, సామాన్లు తీసుకుని వెళ్లిపోయింది. ఈ సంఘటనతో తీవ్రవేదనకు గురయ్యాడు. ఈ విషయాన్ని తల్లికి ఫోన్‌చేసి చెప్పుకొన్నాడు. కుమారుడు కష్టం విన్న తల్లి తాను ఆనంద్‌బాగ్‌కు వస్తున్నానని కాపురాన్ని చక్కదిద్దుతానని ధైర్యం చెప్పింది. కానీ బాధను తట్టుకోలేక ఆరోజే ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి అంజమ్మ ఆదివారం రాత్రి కుమారుడు ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా కనిపించాడు. దీంతో తల్లి అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా కుమారుడు చావుకు కుటుంబ భార్యభర్తల కలహాలే కారణమని అందులో పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: