మహారాష్ట్ర రాజకీయాల్లో కనివిని ఎరుగని రీతిలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మంగళవారం మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకే సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. గత కొన్ని రోజుల నుండి ఇక్కడి రాజకీయాల్లొ ఊహించనంత వేడి రాజుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా..

 

 

శివసేనపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు బీజేపీకే మద్దతు పలికారని తెలిపారు. శివసేన తమను మోసం చేసిందన్నారు. ఇకపోతే ఈ రాజకీయంలో కీలక మలుపు ఏంటంటే డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయడం ఈ నిర్ణయం మొత్తం రాజకీయ అంచనాలనే తలకిందులుగా చేసింది. ఇకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం తమకు లేదని ఫడ్నవీస్ చెప్పారు. ఎన్సీపీ శాసనసభా పక్ష నేత అయిన అజిత్ పవార్ మద్దతు ప్రకటించడంతో.. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా తమకు అండగా ఉంటుందని భావించానని తెలిపారు.

 

 

ఇక బుధవారం ఫడ్నవీస్ సర్కారు బలాన్ని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నిరూపించుకోవాల్సి ఉండగా.. అంతకు ముందే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఊహించని విధంగా బీజేపీ ప్రభుత్వం కూలిపోగా..  శివసేన నేత ఉద్ధవ్ థాక్రే సీఎం కావడానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇక ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాక, శివసేన సీఎం పీఠం కోసం బీజేపీని వీడిందని అధికారం కోసం  శివసేన సోనియా గాంధీ నాయకత్వాన్ని అంగీకరించిందని ఫడ్నవీస్ మండిపడ్డారు.

 

 

ఇక భవిష్యత్తులో  శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి స్థిరమైన ప్రభుత్వాన్ని అందిచలేవన్న ఆయన తన బావాన్ని వ్యక్తం చేశారు ఇకపోతే  ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. ఇక శరద్ పవార్ భార్య మాట్లాడటంతో ఆయన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. అజిత్ పవార్‌ను వెనక్కి రప్పించడంలో ఎన్సీపీ సఫలం కావడంతో ఉత్కంఠంగా సాగుతున్న ఈ మహా డ్రామాకు తెరపడినట్లైంది..

మరింత సమాచారం తెలుసుకోండి: