మహారాష్ట్రలో  సార్వత్రికల  ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు నెల రోజులు అవుతోంది అయినా అక్కడ ఇంకా స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కాలేదు .ఎవరు ఊహించని విదంగా రాత్రికి రాత్రే బీజేపీ ఏర్పడటం జరిగింది ఇలా   బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి కారణం  అమిత్ షా చాణక్యం అంటూ కమలం పార్టీ వాళ్లు ప్రచారం చేసుకున్నారు. 

 

మహారాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-శివసేనలు పొత్తుతో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ కూటమికి ప్రజలు అధికారం అప్పగించారు.అయితే ముఖ్యమంత్రి పీఠం విషయంలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు ..  సీఎం పీఠాన్ని  పంచాలంటూ శివసేన ఆ ప్రసక్తే లేదని బీజేపీ వాదులాడుకున్నాయి. గడువులోగా అవి ఒప్పందానికి రాలేదు. ఎవరి వాదనలు వారు వినిపించారు. 

 

సమయం వరకూ వేచి చూసిన గవర్నర్ ముందుగా బీజేపీని పిలిచారు. అయితే తమకు బలంలేదని బీజేపీ ముందుకు వెళ్లలేదు.అక్కడితో ఆగిపోయి ఉంటే కమలం పార్టీ గౌరవం కాపాడుకునేది.  అయితే ఆ తర్వాత బీజేపీకి కన్నుకుట్టింది. సేన-కాంగ్రెస్-ఎన్సీపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే సరికి బీజేపీ ఓర్వ లేకపోయింది .

 

ఆ ఓర్వలేని తనం టోన్  ఒక అర్థం లేని పని చేసింది. అజిత్ పవార్ ను నమ్ముకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చింది. అయితే అజిత్ కు ఉన్న బలమెంతో బీజేపీ అంచనా వేయలేకపోయింది.ఆయనేమో  విశ్వాస పరీక్షకు ముందే చేతులెత్తేశాడు!

 

అసలు అలాంటి వ్యక్తిని నమ్ముకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసింది? అంటూ  అనేక మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇప్పుడు. అలాంటి వాడినా బీజేపీ నమ్ముకున్నది అనే కామెంట్ వినిపిస్తూ ఉంది.మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం అమిత్ షా చాణక్యం అంటూ కమలం పార్టీ వాళ్లు కొందరు చంకలు  గుద్దుకున్నారు

 

కానీ  ఇప్పుడు  పరువు  పోయింది బీజేపీ కె .  ఇది వరకూ ఇలానే కర్ణాటకలో కొన్నాళ్ల కిందట బీజేపీ పరువు పోగొట్టుకుంది. ఇప్పుడు మహారాష్ట్రలో అలాంటి అనుభవానే ఎదుర్కొంది.ఇంటకిబ్ ఈ మహా వివాదం ఎప్పుడు కొలిక్కి వస్తుందో ఏ ప్రభుత్వం అధికార పక్షముగా అవతారం ఎత్తుతుందో చూడాలి .

 

మరింత సమాచారం తెలుసుకోండి: