ఇటీవల ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో అల నాటి స్టార్స్ అంతా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో  కలిసి గ్రాండ్‌గా వార్షికోత్సవ పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు . దాదాపు 50 మంది స్టార్ నటీనటులు అందరు కలిసి  చిరు ఇంట్లో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్‌లోకలిసి ఎంజాయ్ చేసారు . అప్పటి మెమొరీస్‌ను  అన్నిటిని గుర్తుచేసుకున్నారు. అయితే  ఏ పార్టీకి తనను ఆహ్వానించనందుకు బాధపడుతున్నారు ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్. ప్రతాప్ పోతెన్. తెలుగులో ఆకలి రాజ్యం, కాంచన గంగ, జస్టిస్ చక్రవర్తి, మరోచరిత్ర వంటి ఎన్నో సినిమాల్లో నటించిన ప్రతాప్‌ను ఈ పార్టీకి పిలవలేదట.

 

 దాంతో ఆయన ఫేస్‌బుక్ వేదికగా తన బాధను వ్యక్తం చేశారు. ‘నేను ఎయిటీస్ రీయూనియన్‌కు నేను అర్హుడిని కానేమో. బహుశా నేను మంచి నటుడ్ని, దర్శకుడిని కానేమో. అందుకే చిరంజీవి నన్ను పిలవనట్లున్నారు. నాకు చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం. నా సినిమాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. కానీ జీవితం అన్నాక అలా సాగిపోతూనే ఉండాలి’ అని పేర్కొన్నారు.

 

రీయూనియన్ పార్టీలో రాత్రంతా చాలా ఎంజాయ్ చేశామని అన్నారు ప్రముఖ బాలీవుడ్ నటి పూనమ్ ధిల్లన్. ఆమె తెలుగులో ఒక్క సినిమాలో మాత్రమే ఆమె నటించారు ఆ సినిమా  శ్రియ నటించిన ‘ఇష్టం’ సినిమాలో పూనమ్ హీరోకు తల్లి పాత్రలో నటించారు. కానీ ఆమె కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. రాత్రంతా ఎన్నో కబుర్లు చెప్పుకున్నామని, అంత్యాక్షరి కూడా ఆడామని తెలిపారు. ఉదయం 6 గంటలకు చిరు ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆ తర్వాత అందరం ఇళ్లకు బయలుదేరామని తెలిపారు. 

 

కనీసం ఈ రకంగానైనా తెలుగు సినీ తారలను కలుసుకునే అవకాశం దక్కిందని పేర్కొన్నారు.ఇంతకీ ఈ రీయూనియన్ అనేది ఏంటంటే.. 80ల కాలంలో సినీ తారలంతా ఏటా ఇలా ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఏ కలర్ డ్రెస్సు వేసుకోవాలో ముందుగానే అన్నీ మాట్లాడుకుంటారు. ఈసారి మాత్రం స్టార్లంతా గోల్డ్, బ్లాక్ కాంబినేషన్‌లో ముస్తాబై వచ్చారు. 2018లో చెన్నై టినగర్లోని ఓ ప్రైవేట్ రెసిడెన్స్‌లో 22 మంది స్టార్స్ రీ యూనియన్ పార్టీలో పాల్గొన్నారు. అప్పుడు అంతా డెనిమ్స్ అండ్ డైమండ్ థీమ్‌తో పార్టీలో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: