తమన్నా.. సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్. హీరోయిన్ గా ఇప్పటికే గత 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మనుగడ సాగిస్తోంది. తెలుగు సినిమాలతో పాటుగా తమిళ ఇండస్ట్రీలో కూడా తన హవాకొనసాగిస్తున్నది. సౌత్ లో దాదాపుగా అందరు స్టార్స్ తో కలిసి నటించిన తమన్నా.. కోలీవుడ్ లోను అదే హవాను కొనసాగించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కూడా కలిసి నటించింది.
అయితే, తమిళంలో మాత్రం ఈ అమ్మడు కమల్, రజినీకాంత్ లతో కలిసి నటించలేదు. అవకాశం వస్తే ఇద్దరు స్టార్స్ తో కలిసి నటించాలని అనుకుంటోంది. గత 12 సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉన్నప్పటికీ తమన్న ఎందుకో ఆ ఇద్దరు స్టార్స్ తో కలిసి నటించలేకపోయింది. కారణం ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది. ఇక ఇదిలా ఉంటె, తమన్నా చూపులు ఇప్పుడు రాజకీయాలవైపు మరలుతున్నట్టుగా తెలుగీస్తున్నది.
సాధారణంగా సినిమా రంగంలో రాణించిన స్టార్స్ రాజకీయాల్లోకి వెళ్లడం పెద్ద విషయం కాదు. ఇలా చాలా మంది వెళ్లారు. జయలలిత, జయసుధ, జయప్రద, రోజా, నగ్మా, ఇలా ఎందరో సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వెళ్లారు. తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే చేసిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలుపొందింది. అలానే బెంగాల్ లోను ఇద్దరు యువ హీరోయిన్లు రాజకీయాల్లోకి వెళ్లి ఎంపీలుగా గెలిచారు.
ఇప్పుడు ఇదే బాటలో తమన్నాకూడా వెళ్లాలని అనుకుంటోంది. తమన్నాకు తెలుగులో ఎంత పేరు ఉన్నదో అటు తమిళనాడులో కూడాఅంతే పేరు ఉన్నది. ఈ పేరును ఉపయోగించుకొని తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకుంటోంది. తమిళనాడులో కమల్ హాసన్ ఇప్పటికే పార్టీని స్థాపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధించలేదు. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పెట్టుకున్నారు. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకున్నారు. అయితే, తమన్నా కమల్ హాసన్ పార్టీ తరువాత పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆమెకు ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారు అన్నది తెలియాల్సి ఉన్నది.