ఫార్టీ ఇయర్స్ రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే... కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో గెలిచిన జనసేన పార్టీకు అధినేత అయిన పవన్ కళ్యాణ్... జగన్ మోహన్ రెడ్డిని ప్రతి విషయంలో విమర్శిస్తున్నాడు. ఆ మధ్య ఇసుక కొరతపై జగన్ ను విమర్శిస్తూ.. ఇసుకపై జరిగే అవినీతిపై యుద్ధం చేస్తామని విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించి ఏపీ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డాడు.... దాని తర్వాత ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన జగన్ ప్రభుత్వంపై ప్రతిరోజు ఏదో ఒక విధంగా నిప్పులు చెరుగుతూనే ఉన్నాడు పవన్. మన తెలుగు మాతృ భాషని ,మృత భాషగా మార్చకండి జగన్ రెడ్డి గారు అంటూ ట్వీట్లు చేసిన విషయం మనకు విదితమే.


జగన్ 6 నెలల పాలనపై కూడా 6 పదాల్లో వివరించి..ఆ తర్వాత 4 రోజులు వరుసగా ట్వీట్లు చేస్తూ.. తాను రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఇక ఇవ్వన్నీ చూస్తున్న వైసీపీ నేతలు రంగంలోకి దిగి.. పవన్ కళ్యాణ్ విమర్శలకు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇదే సందర్భంలో....మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా సెల్వమణి కూడా తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.



ఆమె మాట్లాడుతూ... ‘జగన్ మోహన్ రెడ్డి ఆరు నెలల పాలన చూసి ప్రజలు సై సైరా నరసింహారెడ్డి అంటున్నారు. కానీ, చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ చిన్నమెదడు చితికిపోయింది. అందుకే ఇసుక, ఇంగ్లీష్ మీడియం విషయంలో వివాదాలు సృష్టించారు. మత మార్పిడులు చేస్తున్నారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు బాధ తెలుగు కోసం కాదు.. ప్రజల కోసం కాదు. తన బినామీల స్కూళ్లు మూతపడతాయని భయం.’ అని చెప్పారు. రోజా వ్యాఖ్యలపై జనసేన ఎలా స్పందిస్తుందో చుడాలిక. 



మరింత సమాచారం తెలుసుకోండి: