అదేంటి పళ్లు తోముకుంటే.. ప్రాణాలు పోవడం ఏంటనుకుంటున్నారా.. అవును ఇది నమ్మడానికి విచిత్రంగా ఉన్నా.. వాస్తవంగా జరిగిన సంఘటనే ఇది. ఇది కర్ణాటకలో యథార్థంగా జరిగిన సంఘటన. కర్ణాటక రాష్ట్రంలోని మాల్పేలో జరిగిందీ దారుణం. అసలేమైందంటే..

 

ఓ మహిళ.. తెల్లవారుజామునే నిద్రలేచి.. అలవాటు చొప్పున పళ్లు తోముకుంది. అయితే ఇంతకూ ఆమె పళ్లు తోముకున్నది టూత్ పేస్ట్ తో కాదు.. మరి ఇంకా దేంతో అంటారా.. ఎలుకల మందుతో. అవును.. ఇంట్లో ఎలుకలను చంపేందుకు పేస్ట్ వంటి ఎలకల మందు తెచ్చి పెట్టారట. కానీ ఆ మహిళ తొందరలో ఈ విషయాన్ని గమనించలేదు. అందులోనూ ఇంట్లో టూత్ పేస్టు ఉండే ప్రాంతంలోనే ఆ ఎలకల మందు పేస్టు కూడా ఉన్నది. అందులోనూ అంతకు ముందు రోజే ఇంట్లో టూత్ పేస్టు కూడా అయిపోయింది. ఓహో..ఇదేదో కొత్త బ్రాండ్ అనుకుందో ఏమో ఏకంగా ఎలకల మందు పేస్టుతో పళ్లు తోముకుంది.

 

అందులోనూ ఆ ఎలకల మందు చాలా పవర్ ఫుల్ గా ఉంది. అంతే పళ్లు తోముకున్న వెంటనే అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె దాదాపు వారం రోజులపాటు చికిత్స పొందింది. మృత్యువుతో పోరాడింది కానీ.. చివరకు ఫలితం దక్కలేదు. ఆదివారం రోజు ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

 

టూత్ పేస్ట్ బదులుగా ఎలుకల మందు ఉపయోగించడంతోనే ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఊహించని విధంగా ఆ ఇంట్లో మహిళ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలాంటి దారుణం మరెక్కడా జరగకూడదని రోదిస్తున్నారు. అందుకే ఇళ్లలో పురుగుమందులు, ఎలకల మందులు వంటి విష పదార్థాలను సరిగ్గా భద్రపరచాలి. ఆ విషయం ఇంట్లో అందరికీ తెలియజేయాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: