'చూసి చూడంగానే నచ్చేసావే' అంటూ చలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక జంటకు ఫాన్స్ ఎక్కువ, గీత గోవిందం సినిమాలో వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదరడంతో సినిమా భారీ విజయాన్ని సాధించింది, అంతటి హిట్ సాధించిన తరువాత డియర్ కామ్రేడ్ లో విజయ్ దేవరకొండ మరియు రష్మిక కలిసి నటించారు. కానీ ఈ చిత్రం అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు కానీ విజయ్ మరియు రష్మికల కెమిస్ట్రీ మళ్ళీ సూపర్. దేవదాస్ చిత్రంలో నాని సరసన రష్మిక నటించింది, ఇందులో నాగార్జున మరో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం కూడా ఊహించిన విజయం సాధించలేదు. అయితేనేం ఈ ముద్దుగుమ్మకి మాత్రం ఆఫర్స్ తగ్గలేదు.

 

ప్రస్తుతం రష్మిక చేతిలో మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి, సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం జనవరి 11, 2020సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. ఇది కాక, ఆమె నితిన్ రాబోయే సినిమా భీష్మ లో కూడా నటిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో తెరపైకి రానుంది. ఇక ఈ రెండు సినిమాలు కాకుండా అల్లు అర్జున్ - సుకుమార్ యొక్క రాబోయే చిత్రంలో రష్మిక నటిస్తున్నారు, దీని షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ సినిమాలు విడుదలైతే, రష్మిక టాప్ ప్లేస్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఒక వార్త వైరల్ అవుతోంది, రష్మిక మందాన తన కెరీర్లోనే బెస్ట్ ఆఫర్ కు నో చెప్పేశారని బాలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్లో నాని జెర్సీ రీమేక్ కోసం రష్మికను సంప్రదించారు, ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. తెలుగులో జెర్సీ సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ హిందీ చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. తన కాల్ డేట్స్ ఖాళీగా లేవంటూ రష్మిక ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. ఇది బాలీవుడ్ చిత్రం కావడంతో రష్మికకు భారీ పారితోషికం ఇస్తామని నిర్మాతలు చెప్పినట్లు సమాచారం. అయినా కూడా రష్మిక తన కాల్ డేట్స్ విషయం చెప్తూ సినిమా ఆఫర్ ను తిరస్కరించారట. ఏదిఏమైనా బాలీవుడ్ హీరోకి నో చెప్పేసింది అంటూ బీటౌన్ లో రష్మిక పై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: