2014 ఎన్నికల్లో గెలిచినా చంద్రబాబు నాయుడు  రాజధాని నిర్మిస్తామని పిల్లల నుంచి వసూలు చేసిన చందాలు, ఇటుకలు ఏమయ్యాయని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్‌ చంద్రబాబును నిలదీశారు.రాజధాని పేరు చెప్పి బాబు బినామీలు భారీగా భూములు కొనుగోలు చేసారు అని చెప్పారు. తాత్కాలిక భవన నిర్మాణాల పేరుతో ఎక్కువ కమీషన్లు తీసుకోవచ్చు అని చంద్రబాబు భావించి అడ్డగోలుగా దోచుకున్నారని అన్నారు. పర్మినెంట్‌ అంటే లెక్కలు చూపించాల్సి వస్తుందన్న భయంతో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారన్నారు.

 

 రాజధాని ప్రాంతంలో కేవలం రెండే రెండు బిల్డింగ్‌లు కట్టారని, ఒకటి హైకోర్టు మరొకటి  తాత్కాలిక సచివాలయమన్నారు ఆ రెండు కూడా నాణ్యత లేకుండా కట్టారు అని ధ్వజమెత్తారు. చిన్న వర్షం కురిస్తే చాలు కారుతుందని చెప్పారు. చంద్రబాబు రాజధానిని సర్వనాశనం చేశారన్నారు. భూములు ఇచ్చిన రైతులను మోసం చేశారని మండిపడ్డారు. 


 రాజధాని శంకుస్థాపనకు చాల ప్రాంతం నుంచి లక్షల ఇటుకలు ఇచ్చారని, ఆ ఇటుకలు ఏమయ్యాయో తెలియదన్నారు. విద్యార్థులతో కూడా రూ.10 చొప్పున చందాలు వసూలు చేశారని, ఆ డబ్బులు ఏం చేశారో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ నేతలు ఇప్పుడేమో రూ.9 వేల కోట్లు రాజధానికి ఖర్చు చేశామని చెబుతున్నారు దానికి మాత్రం లెక్క చెప్పడం లేదన్నారు.

 

వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకంతో ప్రజలు 151 సీట్లు ఇచ్చి అఖండ మెజారిటీతో   గెలిపించారు అని తెలిపారు.చంద్రబాబుకు వయసు పెరిగే కొద్ది చాదస్తం పెరుగుతుందని దుయ్యబట్టారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవమంతా కూడా కుట్రలు, మోసాలే అన్నారు. చంద్రబాబు అమరావతిలో పరేడ్‌ చేసేందుకు అనర్హులు అన్నారు. ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందించాలని సూచించారు. రాజధాని ఎలా నిర్మించాలో మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి చాల బాగా తెలుసు అన్నారు. వైయస్‌ జగన్‌ విషయంలో ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఏమీ చేయలేరన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: