ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ మేధావి .. ఇప్పుడు అందుకు భిన్నంగా చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తున్నారు. దీనితో పవన్ గారు ఎటు వైపో జనాలకు క్లియర్ కట్ గా అర్ధం పౌయింది. నోరు తెరిస్తే చాలు జగన్ మీద రంకెలు వేసే పవన్ గారు .. బాబు గారిని మాత్రం ఒక్క మాట కూడా అనరు. అయితే ఏపీ అధికారపక్షం సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెట్టేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవటం.. దీనిపై ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైతే.. రాజకీయ వర్గాల నుంచి మాత్రం వ్యతిరేకత వ్యక్తమైంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏపీ విపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు.

 

కానీ జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తం అవుతుంది. అయితే.. ప్రజల నుంచి.. అధికారపక్షం నుంచి ఈ ఎపిసోడ్ లో ఎదురైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. అయితే.. అడ్డ బ్యాటింగ్ చేసినట్లుగా పస లేని వాదనలు వినిపించటం షురూ చేశారు. ఇది సరిపోదన్నట్లుగా బాబుకు తోడయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలుగుభాష మీద తనకున్న ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తూ తరచూ ట్వీట్లు చేయటం.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టటం లాంటివి చేస్తున్నారు పవన్ కల్యాణ్. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ స్టాండ్ తీసుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. సమస్య అంతా తాను వినిపించే వాదనకు కౌంటర్ గా వచ్చే ప్రశ్నలకు పవన్ సమాధానాలు ఇవ్వకపోవటం.



ఒక పక్క అధికార పార్టీ పవన్ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారంటే చెప్పలేని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తే.. తెలుగు మీద ఇప్పటి వరకూ వినిపించిన వాదనకు భిన్నంగా ఉందని చెప్పక తప్పదు. ప్రభుత్వ పాఠశాల్లలో ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించిన పవన్.. ఇంగ్లీషు మీడియాన్ని తాను వద్దటనటం లేదని తెలుగుభాషను వదలొద్దనే మాటనే తాను చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. జగన్ ప్రభుత్వాన్ని ఏదో ఒక అంశంలో టార్గెట్ చేయాలన్న చంద్రబాబు కక్కుర్తికి ఏ మాత్రం తగ్గకుండా పవన్ టీడీపీ అధినేత దారిలో నడవటమే పెద్ద తప్పుగా చెబుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: