మనుషులు మరీ రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు ఇటీవల ఒక గుడిలోపూజ చేసే పూజారి కూడా కామాంధుడిగా మారి గుడిలోనే అపచారానికి ఒడిగట్టారు. దేవుడి దర్శనానికి వచ్చిన మహిళను  గుడిలోకి తీసుకెళ్లిన పూజారి అసభ్యంగా ప్రవర్తించడంతో మహిళ అతడిని ప్రతిఘటించిం కేకలు వేసుకుంటూ బయటకు వచ్చేసింది. కుటుంబసభ్యులు ఏం జరిగిందని అడగ్గా విషయం చెప్పింది. దీంతో వారు గుడిలోకి వచ్చేసరికే  పూజారి కామాంధుడు పరారయ్యాడు. నిత్యం భగవంతుడి సేవలో ఉంటూ ఆయన్నే స్మరిస్తూ ఉండే అర్చకుడు కీచకుడి అవతారమెత్తాడు. దైవ సన్నిధిలోనే భక్తురాలిపై అత్యాచారానికి యత్నించడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలోని ఓ ఆలయంలో ఈ ఘటన జరిగింది.విజయవాడకు చెందిన దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి  గ్రామంలోని ఆలయానికి వచ్చారు. పెళ్లయి చాలారోజులైనా పిల్లలు కలగకపోవడంతో ఆ దంపతులు సంతానం కోసం ప్రత్యేక పూజలు చేశారు.  సంతానం కలగాలంటే మహిళతో  గర్భగుడిలో ఒంటరిగా మాట్లాడాలని, అప్పుడే కోరిక నెరవేరుతుందని అర్చకుడు వారికి మాయమాటలు చెప్పడంతో సరేనన్నారు. దీంతో అతడు మహిళను దైవ సన్నిధిలోకి తీసుకెళ్లి అసభ్యంగా మాట్లాడుతూ చెయ్యువెయ్యబోయాడు పూజారి. అతడి చేష్టలకు భయపడిపోయిన మహిళ  కేకలు వేసుకుంటూ బయటకు వచ్చి జరిగింది అంత భర్తకు వివరించడం తో వాడి కోసం వెతకడం తో పరార్ అయ్యాడు.  ఇది చుసిన భక్తులు వాడి కోసం వెతికి పోలీసులకు సమాచారం ఇచ్చి చర్య తీసుకోవాలని విన్నపించుకున్నారు. పోలీసులు పిర్యాదు నమోదు చేసుకొని విచారణ నిర్వహిస్తున్నామని వివరించారు.  కీచకుడైన ఆ అర్చకుడిని వెతికి పట్టుకున్న పోలీసులకు అతడు నేను సంతానం కలగడం కోసం చేసే పూజ విధానాన్ని మాత్రమే చెప్పానని ఆమె అపార్థం చేసుకుంది అని వివరించాడు. కొంచం కఠినంగా ప్రవర్తించిన పోలీసులకు జరిగింది అంత వివరించాడు తప్పుకు కటకటాల పాలు అయ్యాడు.ఈ విషయం విన్న భక్తులు ఎవరు ఇలాంటి వారు అని తెలుసుకోవడం కష్టమేనని ఎవరిని నమ్మేలా లేదు అని ఆందోళన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: