టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మళ్లీ మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. ఈ మాటల యుద్ధం ఏ రేంజ్ కు వెళ్లిందంటే.. ఓ వైసీపీ మంత్రి ఏకంగా తన ప్రత్యర్థులను బట్టలూడదీసి కొడతా అని వార్నింగ్ ఇచ్చేశాడు. ఆయన ఎవరో కాదు.. కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ మంత్రి కొడాలి నాని. టీడీపీ నేతల విమర్శలకు ఆయన తనదైన శైలిలో స్పందించారు.
చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడితే బుద్ధి చెబుతామని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. రాజధానిలో దళితుల భూములను చంద్రబాబు దోచేశారని, ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఆ ప్రాంతంలో పర్యటిస్తారని ప్రశ్నించారు. అందుకే వాళ్లంతా చంద్రబాబును నిలదీసే పరిస్థితి ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని తెలిపారు. చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని రాజధానిలో తిరుగుతారని ప్రశ్నించారు.
చంద్రబాబును రేపు రాజధాని ప్రాంతంలోని రైతులు, దళితులు నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు తానే కట్టినట్లు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే టీడీపీ నేతల బట్టలూడదీసి కొడతామని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. చంద్రబాుకు మంగళగిరి, తాడికొండలో టీడీపీ ఓడిపోయినా సిగ్గు రాలేదన్నారు. తాను సీఎంగా ఉంటే ఊడబికేవాడిని, వైయస్ జగన్ ఏమి చేయడం లేదని చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని కొడాలి నాని అన్నారు.
అంతే కాదు.. తనదైన మార్కు శైలితో.. చంద్రబాబు పెద్ద లుచ్చా, సన్యాసి, వెధవ అని, ఆయన సీఎం వైయస్ జగన్ను, వైయస్ఆర్ను, రాజారెడ్డిని విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు కొడాలి నాని. చంద్రబాబు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తన పెంపుడు కుక్కలను తనపై వదిలారని, పత్తిత్తు మాదిరిగా టీడీపీ నేతలు రోడ్డుపైకి వచ్చి మాట్లాడుతున్నారని కొడాలి నాని విమర్శంచారు.