ప్రభుత్వ సంబంధిత శాఖల్లో అతి ఎక్కువ గ అవినీతి జరిగే శాఖ ఏది అంటే మొదట గ వినిపిచ్చే పేరు రెవిన్యూ శాఖ రెవెన్యూ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారిపోయాయని ఎన్ని విమర్శలొచ్చినా అధికారులు, సిబ్బంది తీరులో మాత్రం ఎటువంటి మార్పూ కనిపించడం లేదు.చేతి లో డబ్బులు పడనిదే ఏ పనీ కాని పరిస్థితి రెవిన్యూ ఆఫీసర్ లది అన్నట్లుగా మారాయి . డబ్బులు ఇచ్చుకో లేక పోతే సమస్యల పరిష్కారం కోసం సామాన్యులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిందే. కాళ్లరిగేలా తిరిగినా వారి పని అవుతుందన్న నమ్మకం లేదు.
లంచం డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూతిప్పుతూనే ఉంటారు .భూ సమస్య పరిష్కరించకుండా తనను వేధింపులకు గురిచేస్తోందని ఇటీవలే తెలంగాణలో తహసీల్దార్ను సజీవ దహనం చేసిన చోటు చేసుకున్న ఘటన తెలిసిందే. ఆ ఘటన తరువాత చాలా చోట్ల రైతులు, సామాన్యులు తమ పనులు చేయడం లేదు అంటూ పెట్రోల్ డబ్బాలు.. పురుగు మందుల డబ్బాలతో తహసీల్దార్ కార్యాలయాలకు క్యూ కట్టారు. కొందరు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశారు.
మరోవైపు లంచం డబ్బుల పంపకాల్లో తేడాలు రావడంతో ఇద్దరు వీఆర్వోలు తహసీల్దార్ ముందేగొడవపడి కొట్టుకున్న సంఘటన కర్నూలులో జరిగింది. తహసీల్దారే ఇద్దరికీ రాజీ కుదర్చడం గమనార్హం . అదే జిల్లా గూడూరు ఎమ్మార్వో అయినా హసీనాబీ లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసింది .. విషయం ఏసీబీకి వరకు వెళ్ళింది ఆమె ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.
లంచాల వేధింపులతో విసుగుచెందిన ప్రజలు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నా కుక్క తోక వంకరే అన్నట్లు కొంతమంది సిబ్బందిలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. అక్కడక్కడా రెవెన్యూ సిబ్బంది లంచం డబ్బుల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అడంగల్లో పేరు మార్చేందుకు లంచం డిమాండ్ చేసిన వీఆర్వో భాగోతం నెల్లూరు జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వీఆర్వోను డబ్బులు తీసుకుంటుండగా పకడ్బందీగా పట్టుకున్నారు.
తోటపల్లి గూడూరు మండలంపరిధి లోని వరిగొండ గ్రామ వీఆర్వో ఉషా లావణ్య పూర్ణిమ 3 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. నెల్లూరుకు చెందిన పాకం లోకేష్కు చెందిన భూమి వివరాలను ఆన్లైన్ అడంగల్ లో నమోదు చేసి ఈ-పాస్బుక్ ఇచ్చేందు కు గాను ఆమె మూడు వేల రూపాయలు అడిగారు . లంచం చెల్లించడం ఇష్టం లేని లోకేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వీఆర్వో లంచం తీసుకొంటుండగా రెడ్హ్యాండెడ్గా ఆమె ను పట్టుకున్నారు