పప్పు సీన్ సూపర్ వర్మ... ఫోన్ చేసిన ఎమ్మెల్యే ఎవరో తెలుసా...
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన కొత్త సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ప్రమోషనల్ బిజీబిజీగా ఉన్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విశేషాలను వెల్లడించడానికి వర్మ బుధవారం సుదీర్ఘంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి అందర్నీ నవ్వించారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఓ తండ్రి కొడుకులకు అంకితం అని చెప్పాడు వర్మ.
ఈ సినిమాను వర్మ ఎవరికి అంకితం ఇస్తున్నాడో చెప్పకపోయినా... ఈ సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఈ సినిమాను చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ కు అంకితం ఇస్తున్నట్లు చెప్పినట్లయింది అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వర్మ మరో బాంబు పేల్చాడు. తన కెరీర్లోనే తొలిసారి ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేశా అని చెప్పాడు. ఇక తన సినిమాలకు కోర్టులకు వెళ్లడం ఇటీవల కామన్ అయిపోయిందని చెప్పారు. ఇక ఈ సినిమా కథ 2019 - 2020 మధ్య కాలంలో జరిగింది అన్న కాన్సెఫ్ట్తో తెరకెక్కించానన్నారు.
ఇక ట్రైలర్లో చూపించిన పప్పు సీన్ టీడీపీ వాళ్లకే బాగా నచ్చిందని, చాలా మంది ఫోన్లు చేసి మరీ అభినందించారని చెప్పాడు. బహుశా వాళ్లు పీల్ అయి, చెప్పలేకపోయినది తాను చెప్పానని అలా చేసి వుంటారని అన్నారు. ఇక వర్మకు ఈ సీన్ గురించి టీడీపీకే చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఫోన్ చేసి మెచ్చుకున్నట్టు టాక్. ఈ విషయాన్ని వర్మ క్యాంప్ లీక్ చేసింది. ఇంతకు ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు.. నిన్నమొన్నటి వరకు టీడీపీలో ఉండి.. ఆ పార్టీ అధినేత, లోకేష్పై తీవ్ర విమర్శలు చేసి బయటకు వచ్చిన ఎమ్మెల్యేనే అని టాక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెరకెక్కించిన సినిమా కావడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొంది. 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' నవంబర్ 29న విడుదల కానుంది..