భార్యాభర్తల అనుబంధం అంటే ఎవరు విడదీయలేని బంధం. ఈ లాంటి  బంధంలో చాల గొడవలు, మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి ఇవన్నీ పక్కనపెట్టి ముందు కొనసాగాలి. కానీ  ఒక యువకుడు మాత్రం తన భార్యను డ్యాన్స్ మానేయాలని భర్త ఎన్నోసార్లు చెప్పాడు. ప్రేమతో చెప్పినా, కోపంతో చెప్పినా ఆమె అసలు వినిపించుకోలేదు. ఈ విషయంలో దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు మొదలు అయ్యాయి. ప్రతిరోజు ఇంట్లో గొడవ జరుగుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు  సైతం లెక్క చేయకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలో చోటు చేసుకుంది.


 
వివరాల్లోకి వెళ్తే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా..  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడుపాడు గ్రామానికి చెందిన 28 ఏళ్ల వనపర్తి మహేశ్.. కూకట్ పల్లి హైదరాబాద్ నగర్ పరిధిలోని రాంనరేశ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ లో మంచి ప్రతిభ కనబరిచి మహేశ్ మంచి పేరు లభించుకున్నాడు. డ్యాన్సర్ గా గుర్తింపు పొందిన మహేశ్… అదే వృత్తిలో ఉన్న యువతిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది.

 

పెళ్లి తర్వాత కొద్దిరోజుల పాటు సాఫీగానే సాగిన సంసారంలో కలహాలు మొదలు అయ్యాయి. అప్పటి నుంచి మహేశ్.. తన భార్యను డ్యాన్స్ మానేయాలని కోరడం జరిగింది. అయితే మహేశ్ చెప్పిన మాటలను భార్య అస్సలే పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య ప్రతి రోజు గొడవలు జరిగేవి. ఈ మధ్యలో కాలంలో తన భార్యను డ్యాన్స్ మానేయాలని తీవ్రంగా ఒత్తిడి తెస్తుండటంతో కొద్దిరోజులుగా ఇద్దరు మాట్లాడం లేదు. ఈ క్రమంలో ఆమె ఓ డ్యాన్స్‌ కార్యక్రమం కోసం మంగళవారం విజయవాడ బయలుదేరి వెళ్లారు. దీంతో మనస్థాపానికి గురైన మహేష్‌ అదే రోజు రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెప్పాటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: