అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు విసిరిన ఘటనపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో మాట్లాడుతూ చంద్రబాబు పై వైసీపీ గుండాలు దాడి చేశారనడం కరెక్ట్ కాదు. ఒకవేళ దాడి చేయాలనుకుంటే కడప లో దాడి చేయలేమా లేక పశ్చిమ గోదావరిలో దాడి చేయలేమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

చంద్రబాబు ఒక చెవిటి, గుడ్డి, మూగ వాడికి ఏం చెప్పిన అర్ధం కాదు

 

చంద్రబాబు కు ఏం చెప్పిన అర్ధం కాదని ఘాటుగా స్పందించారు. అమరావతిలో అమాయక రైతుల దగ్గర భూములు లాక్కొని, అరచేతిలో స్వర్గం చూపించి, మంచి ఫ్లాట్స్ కట్టిస్తామని నమ్మబలికి చంద్రబాబు తన బినామీలకు భూములు కట్టబెట్టారని ఆరోపించారు. కడుపు రగిలిన రైతులు చంద్రబాబుపై తిరగబడి దాడి చేసారని పేర్కొన్నారు. ఇవన్నీ చంద్రబాబుకు చెప్పిన అర్ధం కాదు వాడొక చెవిటి, మూగ, గుడ్డి అని నాని పేర్కొన్నారు. 

 

"నువ్వు అమరావతి పేరు చెప్పి ఐదు ఏళ్ళు పబ్బం గడిపావు. జగన్ మోహన్ రెడ్డి అలా కాదు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు, నీలా రోజుకో రంగు, పూటకో మాట చెప్పరు. మీరు అన్యాయం చేసిన రైతులందరికీ జగన్ మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తామని చెప్పారు. మంచి పనులు చేస్తున్న సీఎం గారి మీద ఓర్వలేక వైసీపీ గూండాలు దాడి చేసారని చెప్పడం దారుణం. ఇలా అబద్ధాలు చెప్పే మీరు 23 సీట్లకే పరిమితం అయ్యారు" అని మంత్రి కొడాలి నాని చెప్పారు. 

 

ఇక అమరావతి లో రైతులు రెండు వర్గాలుగా విడిపోయారు ఒక వర్గం వారు జై చంద్రబాబు అని నినాదాలు చేస్తూ బాబు కు ఘన స్వాగతం పలుకగా మరొక వర్గం "బాబు గుడ్ బ్యాక్" అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ నిరసన తెలిపారు. ఇక చంద్రబాబు పై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: