అజిత్ పవార్ బీజేపీతో కలిసి ,ఎన్సీపీలో భారీగా తిరుగుబాటు తెచ్చి తొందరగా ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టి పదవీ స్వీకార ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. పలు రకాలుగా అజిత్ పవార్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చాలావరకు ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి.
70 వేల కోట్ల రూపాయల నిధులను అజిత్ పవార్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలెదుర్కొంటున్నారు. బీజేపీ ఈ కేసులను సాకుగా చూపి అజిత్ను తమవైపు తిప్పుకున్నట్టు కథనాలు వచ్చాయి.దేవేంద్ర ఫడ్నవిస్ అజిత్తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక.. ఈ కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ. 70వేల కోట్ల ఇరిగేషన్ స్కామ్ కేసులో అజిత్ పవార్కు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. బీజేపీకి మద్దతునిచ్చినందుకు ప్రతిఫలంగా ఆయనను కేసుల నుంచి విముక్తి కల్పించినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి . అజిత్పై వున్నా ఏసీబీ కేసుల ఎత్తి వేయడం కోసం శివసేన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.
ఇవ్వని ఇలా ఉండగా శరద్ పవార్ చాణక్యం మాట్లాడుతూ .... ముందు ఫడ్నవిస్ ప్రభుత్వం నిలదొక్కుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు సరిగ్గా లేకపోవడం, పవార్ కుటుంబసభ్యులు సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు చేయడంతో అజిత్ ఎట్టకేలకు దిగివచ్చి.. ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు.
బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. తిరిగి ఆయన ఎన్సీపీ గూటికి చేరుకున్నారు. పార్టీలోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. ఈ విషయం పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అజిత్కు అవినీతి కేసుల విషయంలో క్లీన్చిట్ ఇవ్వలేదంటూ షాక్ ఇచ్చారు అమిత్ షా. అజిత్పై కేసులు ఎత్తివేయలేదని ఆయన స్పష్టం చేశారు. అజిత్ పవార్ వెంట బీజేపీ నడవదని, బీజేపీ వెంటే అజిత్ వస్తారని అమిత్ షా చెప్పారు.