ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ప్ర‌భావం బాగా పెరిగిపోవ‌డంతో వాట్సాప్‌, ఫేస్‌బుక్ ప్రేమ‌లు ఎక్కువ అవుతున్నాయి. ఈ సోష‌ల్ మీడియా ప్రేమ‌ల వ‌ల్ల చీటికి మాటికి భార్య‌, భ‌ర్త‌లు గొడ‌వ పడుతూ చివ‌ర‌కు వీరి వైవాహిక బంధాలు విచ్ఛిన్నం అవుతున్నారు. కొన్ని సార్లు ఈ సోష‌ల్ మీడియా ప్రేమ‌ల వ‌ల్ల తెలియ‌ని ఆక‌ర్ష‌ణ‌ల‌కు లోన‌వుతూ ఎవ‌రికి వారు పెళ్ల‌య్యాక కూడా ఇత‌ర వ్య‌క్తుల‌తో వివాహేత‌ర సంబంధాలు పెట్టుకుంటున్నారు.

 

తాజాగా నెల్లూరులో వాట్సాప్ ప్రేమాయణం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. భర్త, ఇద్దరు పిల్లలుండగా ఓ భార్య ప్రియుడితో వాట్సాప్ ప్రేమాయణం కొనసాగించింది. చివరకు విషయం బయటపడటంతో ప్రియుడిని చితకబాది పోలీసులకు అప్పగించాడు భర్త. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు న‌గ‌రంలోని వైఎస్సార్ న‌గ‌రంలో నివాసం ఉండే సలీం, పర్వీన్ భార్యాభర్తలు. పదేళ్ల క్రితం వీరికి పెళ్లైంది, ఇద్దరు పిల్లలున్నారు. సలీం ఆటో మెకానిక్ కాగా, పర్వీన్ ఇంట్లోనే ఉండేది. ఇటీవల ఓ మహిళ ద్వారా పర్వీన్ ఫోన్ నెంబర్ షేక్ షుకూర్ అనే ఆటో డ్రైవర్ తీసుకున్నాడు. 

 

అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య వాట్సాప్ ప‌రిచ‌యం ప్రారంభ‌మైన ఇది క్ర‌మంగా ప్రేమాయణం నడిచింది. తరచూ ఒకరినొకరు కలుసునేవారు కూడా. వీరు ఏకాంతంగా ఉన్న‌ప్పుడు సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అయితే ఈ ఫొటోలు భ‌ర్త కంట ప‌డ్డాయి. వీరి బండారం బ‌య‌ట ప‌డింది. భార్య, ప్రియుడితో కలసి ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అయితే భర్తపై దాడి చేసి ప్రియుడు పరారయ్యాడు. 

 

చివ‌ర‌కు ఆ భ‌ర్త త‌న స్నేహితుల సాయంతో త‌న భార్య ప్రియుడిని వెతికి ప‌ట్టుకుని తన భార్యతో సహా ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు. తను తప్పు చేశాని ఒప్పుకున్న షుకూర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి ప్రేమాయణానికి సాక్షిగా ఉన్న సెల్ ఫోన్‌ని, ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: