సమాజంలో జనాలు మొత్తం కామం మత్తులో జోగుతున్నారు . ఇప్పటికే రోజురోజుకు దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నెలలు  నిండని  పసి కందు నుంచి పండు ముసలి వరకు కామాంధులు కామ వాంఛకు బలైపోతున్నారు. రోజు రోజుకి మహిళలకు ఎక్కడ రక్షణ లేకుండా అయిపోతుంది . బయట తిరిగితే ఆకతాయిల నుంచి... చదువుకోవటానికి వెళ్తే గురువుల నుంచి ఇంట్లో ఉంటే సొంత వారినుంచి ... దీంతో రక్షణ  లేని ప్రశ్నార్థక జీవితంలోనే గడుపుతున్నారు మహిళలు . ఇక్కడ ఇలాంటి ఘోరమైన జరిగింది. సభ్యసమాజం తలదించుకునేలా ఇక్కడ ఓ  తండ్రి ప్రవర్తించాడు. 

 

 

 

 తండ్రంటే కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తండ్రి అంటే  అల్లారుముద్దుగా పెంచి చివరికి ఓ అయ్యా  చేతిలో పెట్టాలి . తండ్రి అంటే ఎవరైనా తన కూతురికి జోలికి వస్తే వారు అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వాలి. తండ్రంటే  సమాజం తీరు  ఎలా ఉందో కూతురుకు నేర్పించాలి. తండ్రి అంటే మంచి నడవడికను కూతురికి అలవరచాలి. కానీ ఇక్కడ ఓ  తండ్రి మాత్రం కూతురికి బుద్ధి చెప్పి సరైన నడవడికను అలవాటు చేయాల్సింది పోయి...కామం మత్తులో  కూతురు మీదనే అత్యాచారానికి ప్రయత్నించాడు. సభ్యసమాజం తలదించుకునేలా కన్నకూతురిపై నే  కన్ను వేశాడు ఇక్కడ ఓ కర్కశ  తండ్రి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. వావివరుసలు మరిచిపోయిన ఆ తండ్రి మానవ మృగం గా మారే కన్న కూతురి జీవితాన్ని చిదిమేసేందుకు ప్రయత్నించాడు. 

 

 

 

 వివరాల్లోకి వెళితే... జీడిమెట్ల రంగా రెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ సమీప కాలనీలో 40 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్య కూతురు తో నివాసముంటున్నాడు. అయితే పదిహేను రోజుల క్రితం తన భార్య అనారోగ్యం పాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. దీంతో కుమార్తెపై తండ్రి మాత్రమే ఇంట్లో ఉంటున్నారు . ఒకరోజు కుమార్తె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు ఆ వ్యక్తి. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తండ్రి తన కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నాన్న ఎందుకు ఇలా చేస్తున్నావ్... ఇలా చేయడం తప్పు నాన్న... నా బతుకును నాశనం చేయొద్దు అంటూ ఆ కూతురు వేడుకున్నప్పటికీ కూడా ఆ కర్కశ తండ్రి మీద పడిపోయాడు. దీంతో ఎలాగోలా తండ్రి బారినుంచి తప్పించుకున్న ఆ బాలిక బయటకు వెళ్లి విషయాన్ని తన స్నేహితురాలితో చెప్పడంతో... ఆ బాలిక తన తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఆ తల్లిదండ్రులు బాధితురాలిని  వివరాలు అడిగి తెలుసుకో lగా తన తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ బాలిక బాలిక చెప్పడంతో స్థానికులందరు  ఆ తండ్రిని చితకబాదారు. అనంతరం ఆ కామాంధుని పోలీసులకు అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: