సమాజంలో రోజు రోజుకు మానవ సంబంధాలు కంచించుకు పోతున్నాయి. ఎవరికి వారు తమ స్వార్థ ప్రయోజనాలు, ఇతరత్రా అవసరాలు, కోరికల నేపథ్యంలో వావి వరసలు కూడా మరచిపోతున్నారు. సొంత వదినపైనే కన్నేసిన మరిది... కజిన్లపైనే అత్యాచారాలు, వయస్సులో పెద్దదైన మహిళలపై అత్యాచారాల వార్తలు రోజూ చూస్తూనే ఉన్నాం... ఇక చాలా సార్లు సొంత కోడలిపైనే కన్నేసి రేప్ చేసిన మామల సంఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రాజస్థాన్లో కూడా ఇలాంటి తరహా సంఘటనే ఒకటి జరిగింది.
ఈ దారుణ సంఘటనలో కోడలి చేసిన పాపం ఏం లేదు.. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించడమే. రాజస్తాన్లోరి భివాడిలో ఈ దారుణం జరిగింది. ట్రిపుల్ తలాక్ని నిరాకరించినందుకు కోడలిపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. తన కొడుకికి ట్రిపుల్ తలాక్ చెప్పేందుకు బాధిత యువతి నిరాకరించింది. దీంతో కోడలిపైనే కక్ష కట్టిన ఆ మామ తనతో పాటు నత బంధువుతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు.
శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధిత యువతి(25) సోమవారం పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చెప్పిన ట్రిపుల్ తలాక్ని నిరాకరించినందుకు మొదట ఆమెపై దాడికి పాల్పడ్డారని.. అనంతరం ఆమె మామ,మరో బంధువు అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఆమె భర్త, మామ, బంధువుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక ఇదే పోలీస్ స్టేషన్లో ఇటీవల ట్రిఫుల్ తలాక్ కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నాయి. నవంబర్ 17న తన భర్త ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆరోపిస్తూ ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. అత్తమామలు కూడా విడాకులకు తనపై ఒత్తిడి తెస్తున్నారని బధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తలాక్కు ఒప్పుకోలేదని నరకం చూపిస్తున్నారని కూడా ఆమె వాపోయింది. దీంతో భర్తతో పాటు అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.