రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి మొదట కాంగ్రెస్ తర్వాత  టీడీపీ మల్లి కాంగ్రెస్ ఇలా మారారు తర్వాత ఆయనే సొంతంగా రాయలసీమ పరిరక్షణ పేరు సొంత పార్టీ పెట్టారు ఇలా  ఒక్క పార్టీ లో స్థిరంగా లేని అయన ఇప్పుడేమో మల్లి బీజేపీ తీర్తం పుచ్చు కున్నారు ఆయనతో పాటు అయన కుమార్తె  ప్రముఖ రేడియాలజిస్ట్  అయినా డాక్టర్ సుభారి, వారితో ప్రముఖ నటుడు, బిగ్‌బాస్-2లో సంచలనం సృష్టించిన  కౌశల్ ఆయన సతీమణి   నీలిమతో కలిసి బీజేపీ లో చేరారు ..

 

గురువారం ఢిల్లీ వెళ్లిన వీరంతా బీజేపీ జాతీయ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రాంమాధవ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నడ్డా వీరికి పార్టీ కండువాలు కప్పిగౌరవంగా బీజేపీ లో కి ఆహ్వానించారు.ఈయన 2014 ఎన్నికల సమయంలో నంద్యాల పార్లమెంటుకు పోటీ చెయ్యాలని భావించారు. కానీ కుదరకపోవడంతో దూరంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేశారు..

 

కానీ టిక్కెట్ దక్కుతుందో లేదో అన్న నమ్మకం లేక  చేరలేదు. దాంతో 2018 లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అక్కడా పొందలేని ఈయన సరిగ్గా  2019 సాధారణ ఎన్నికలకు పదిరోజుల ముందే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి.. టీడీపీకి జై కొట్టారు. ఇదే సమయంలో ఆయన వైసీపీని సంప్రదించారు. కానీ ఆయన తమ్ముడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీలోనే ఉన్నారు.

 

పెదనాన్న రాకను ఆయన ఒప్పుకోలేదు ఇక . చేసేదేమి లేక నందికొట్కూరు టీడీపీ అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన తాజాగా  మల్లి బీజేపీలో చేరారు. ఇటు కౌశల్ కూడా 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరాలని చంద్రబాబును కలిశారు. అప్పట్లో అనకాపల్లి ఎంపీ టికెట్టు అడిగినట్టు ప్రచారం జరిగింది.కానీ  ఏమైందో ఏమో  సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు సతీమణితో సహా బీజేపీలో చేరిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: