ఆంధ్రప్రదేశ్ లో ఒక్కపుడు చక్రం తిప్పిన టీడీపీ కి ఇప్పుడు ఏపీలో అసలు టైం మంచిగా నడవటం లేదు . బీజేపీ, వైఎస్సార్సీపీ ల దెబ్బకి ఆ పార్టీ కుదేలు అవుతోంది . సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీ ని వీడి బయటకు వెళ్లిపోతున్నారు. గత ఆరు నెలలుగా ఒకరి తర్వాత ఒకరుగ బీజేపీ, వైఎస్సార్సీపీలోకి చేరిపోతున్నారు. చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే, ముఖ్య నేతలంతా ఇప్పటికే వేరే పార్టీ ల్లో చేరారు .
తాజాగా మరో నేత టీడీపీని వీడాలని ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం ..గతం లో ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ గ పని చేసిన మాజీ ఛైర్మన్ కారెం శివాజీ కూడా టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు రాజీనామా అనంతరం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరేందుకు సన్నాహాలు జరుపుతున్నారు . శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కారెం శివాజీతోపాటు ఇంకా కొంత మంది నేతలు కూడా వైఎస్సార్సీపీపార్టీ లో చేరబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వారంతా సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
కారెం శివాజీ ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి గురువారమే రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శికి పంపించారు. వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిసన్ ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
కారెం శివాజీ మాల మహానాడు అధ్యక్షుడిగా ఉన్న కారెం శివాజీ.. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తర్వాత చంద్రబాబు శివాజీకి ఏపీ ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఛైర్మన్ పదవి విషయంలో కారెంకు సమస్యలు ఎదురయ్యాయి. ఆయన పదవికి అనర్హులంటూ హైకోర్టులో అయన ఫై పిటిషన్ పడింది .. ఇంకా ఆ వివాదం పూర్తికాలేదు . ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవులకు టీడీపీ నేతలు చాల మంది రాజీనామాలు చేశారు. కానీ శివాజీ మాత్రం పదవికి రాజీనామాచేయలేదు