కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా వ్యభిచారం చేయాలంటే అమ్మాయి ఐతే సరిపోతుందని కొందరు నీచులు నిరూపిస్తున్నారు. ముక్కుపచ్చలారని బాలికలను కూడా ఈ నీఛపు వృత్తిలోకి లాగుతున్నారు. ఆడుకుంటూ చదువుకోవలసిన వయస్సులో మగవాడి కాలికింద పువ్వులా వారి మానాన్ని నలిపేస్తున్నారు. కౄరత్వమైన ఆలోచనలతో మృగంగా మారిన మనుషుల మధ్య అమ్మాయిలు మల్లెపువ్వులా వాడిపోతున్నారు. ఏం జరుగుతుందో అర్దం చేసుకునే వయస్సు వచ్చే సరికి అన్ని జరిగిపోయి కష్టాలపాలవుతున్నారు. ఇప్పుడు ఇలాంటిదే ఓ సెక్స్ రాకెట్‌ లీలలు బయటపడ్డాయి.

 

 

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌‌లో ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో కొన్నాళ్లుగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆరుగురు మైనర్ బాలికలకు విముక్తి కల్పించారు. వీరితో పాటుగా విటులు దీప్తి రంజన్ మల్లిక్, శ్రీకృష్ణ పాల్, పింటు సాహూ, రాకేశ్ సాహూ, దీపక్ మల్లిక్, గ్వాటం బెహెరాతో పాటు గెస్ట్‌హౌస్ రిసెప్షనిస్ట్ అక్షీ గోచాయత్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇకపోతే విటులంతా పట్టణ శివారు గ్రామాలకు చెందినవారని పోలీసులు తెలిపారు.

 

 

రక్షించిన బాలికల్లో నలుగురిని వారి తల్లిదండ్రులకు అప్పగించగా, మిగిలిన ఇద్దరిని శిశు సంక్షేమ కమిటీకి అప్పగించారు. ఇక  సంఘటనా స్థలం నుంచి ఆరు బైక్‌లు, అనేక సెక్స్ టాయ్స్, కండోమ్ ప్యాకెట్లు, పోర్న్ సీడీలు స్వాధీనం చేసుకున్నట్లు జగత్‌సింగ్‌పూర్ పోలీసులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించినట్లుగా కూడా తమవద్ద సమాచారం ఉందని ఈ విషయంలో దర్యాప్తూ ముమ్మురం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

 

 

ఇక  చాపకింద నీరులా విస్తరిస్తున్న వ్యభిచారం వల్ల ఇప్పటికే జరగరాని అనర్దాలు జరుగుతుండగా భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన పడవలసిన అవసరం ఉంది.ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని దోషులను శిక్షించవలసిన అవసరం ఉంది. లేదంటే ముందు ముందు సమాజం మొత్తం ఆర్తనాదాలు , అమ్మాయిల కళేబరాలతో నిండిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: