టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటన చేసిన వేళ.. వైసీపీ మరో సంచలన విషయం బయటపెడుతోంది. అమరావతి విషయంలో చంద్రబాబు చేసిన అవినీతిపై చురుకుగా దర్యాప్తు సాగుతోందని.. త్వరలో ఆ బండారం అంతా బయటపడుతుందని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు వెల్లడించారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలోని భూములను అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయల స్కామ్ చేశారని అంబటి రాంబాబు విమర్శించారు.

 

చంద్రబాబు హయాంలో జరిగిన భూముల కుంభ కోణాన్ని తప్పకుండా బయటపెడతామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాము చంద్రబాబు తరహాలో తాము దుబారా చేయబోమని.. అంబటి అన్నారు. రాజధాని పేరుతో జరుగుతున్న దూబారాను తమ ప్రభుత్వం అరికడుతోందని వివరించారు. కాంట్రాక్టర్ల దోపిడీని అడ్డుకుంటున్నాం.. భూమలు అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారు..ఆ స్కామ్ ను బయటకు తీస్తాం.. అని అంబటి ఘంటాపథంగా చెప్పారు.

 

అంతే కాదు.. అమరావతిని చంపేస్తున్నారు.. గొంతు పిసికేస్తున్నారని చంద్రబాబు పెడబొబ్బలు పెడుతున్నారని.. అంబటి వ్యంగ్యంగా చెప్పారు. అసలు గొంతు పిసకడానికి అమరావతిలో ఏం కట్టారని ప్రశ్నించారు. అసలు అమరావతిలో ఏం పర్యటించావు.. నీ ఇల్లు.. ఆఎమ్మెల్యే క్వార్టర్లు.. కోర్టు.. సచివాలయం.. ఇంతేగా.. ఇవన్నీ.. పది నిమిషాల్లో చూసేశావు.. ఇదేనా అమరావతి.. అసలు ఎందుకు ఐదేళల్లో ఇవే నిర్మించారు.. టెంపరరీయే ఎందుకు.. ఎందుకు పర్మినెంట్ బిల్డింగులు కట్టలేదు.. అంటూ నిలదీశారు అంబటి రాంబాబు.

 

నిన్న చంద్రబాబు పై లాఠీ విసిరారంటూ ఆయన మీడియాకు చూపించారని.. కానీ.. అదే పర్యటనలో తనపై పడిన చెప్పు.. రాయి.. వంటి వాటిని ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో టీడీపీని తుక్కు తుక్కుగా ఓడించారే.. అది గుర్తు రాలేదా... నీ సుపుత్రుడిని కూడా ఓడించారే.. అంత ప్రేమ ఉంది మీ మీద.. అమరావతి ప్రాంతంలో అంటూ అంబటి రాంబాబు గుర్తు చేశారు. తమ ప్రభుత్వానికి అమరావతి విషయంలో స్పష్టమైన అవగాహన ఉందన్నారు అంబటి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: