రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన డాక్టర్ ప్రియాంక దారుణ హత్య ఉదంతంలో తవ్వే కొద్దీ కొన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. బుధవారం 09:44 కు ప్రియాంక ఫోన్ స్విచాఫ్ కావడాన్ని గుర్తించిన పోలీస్ అధికారులు బాడీని పోస్టుమార్టం చేసిన తర్వాత ఫోరెన్సిక్ నిపుణుల అంచనా ప్రకారం గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆమె మరణించి ఉంటుందని చెబుతున్నారు. అంటే ఈ మధ్య ప్రాంతంలో దాదాపు 5 గంటలపాటు ఆమె నరకాన్ని చవి చూసిందని భావిస్తున్నారు. పోలీసులను విస్తుపరిచేలా చేసిన ఆ విషయాలు ఏమిటంటే...

 

పోలీసుల అంచనా ప్రకారం కిడ్నాప్ అయిన తర్వాత... చనిపోయే ముందు వరకు ప్రియాంక చిత్రహింసలకు గురై ఉంటుందని భావిస్తున్నారు. ఆమె తలపై ఒక చిన్న దెబ్బ తగిలినట్లు ఫోరెన్సిక్ లో బయటకు రాగా ఆమె తప్పిపోయిన ప్రాంతంలో స్కూటీ వెనక ఆమె దుస్తులు, చెప్పులు, బ్యాగ్, గుర్తింపు కార్డు మరియు ఆమె నిత్యం ధరించే చున్నీ లాంటివి ఉండడం పోలీసులు గుర్తించారు. వాటి దగ్గరలోనే మద్యం సీసాలు కూడా దొరకడంతో ఆమె అత్యాచారానికి గురై ఉంటుందని భావిస్తున్నారు. అక్కడే ఆమెను అత్యాచారం చేసిన తర్వాత హతమార్చి షాద్ నగర్ వైపు తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అంచనా.

 

అత్యాచారం జరిగిన తర్వాత ఆమె డెడ్ బాడీని అక్కడినుంచి తరలించి తగలబెట్టిన తీరుని చూస్తే ఆ ప్రాంతం మీద బాగా అవగాహన ఉన్నవారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే బాడీ పూర్తిగా తగలబడి పోవడంతో ఆమెపై అత్యాచారం జరిగిందా లేదా అన్న విషయాన్ని సరిగ్గా నిర్ధారించలేకపోతునట్లు ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. అయితే మృతదేహం దొరికిన పది కిలోమీటర్ల దూరంలో కొత్తూరు జాతీయ రహదారి దగ్గర ఉన్న స్కూటీ చుట్టూ పరిస్థితులు మాత్రం గమనిస్తే ఆమె కచ్చితంగా అత్యాచారానికి గురై ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని నేపథ్యంలో ఇంకా నిజానిజాలు బయటకు రావాల్సి ఉంది. అయితే ఈ విషయాలను పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: