ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో ఆడవారిపై ఉన్మాదులు ఏదో రకంగా దాడులకు పాల్పపడుతూనే ఉన్నారు. ఒకప్పుడు భారత దేశంలో ఆడవారిని దేవతల్లా పూజించేవారు. అమ్మ కడుపున పుట్టినందుకు కనీసం ఆడవారిపై జాలీ, దయా లేకుండా కృర మృగాళ్లా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పపడుతున్నారు. చిన్నారులని కూడా చూడకుండా అత్యాచారాలు చేస్తూ దారుణంగా చంపేస్తున్నారు. ఆ మద్య హనుమకొండలో కేవలం తొమ్మిది నెలల పసిపాపపై ఉన్మాదిగా రెచ్చిపోయి అత్యాచారం చేసి తర్వాత గొంతు నులిమి చంపేశాడు ఓ కృరమృగం.
ఇలాంటి ఘటనలు ప్రతినిత్యం వింటూనే ఉన్నాం..చూస్తున్నాం. ఇదే హనుమకొండలో పుట్టిన రోజు సంతోషంగా గడపాలని... తన స్నేహితులతో హ్యాపీగా ఉండాలని ఇంటర్ చదువుతున్న ఓ బాలికను నమ్మించి నయవంచన చేసి ఆమె స్నేహితుడు అత్యాచారం చేసిన చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపణలు సృష్టిస్తుంది. అయితే ఈ హత్య కేసు 24 గంటల్లో ఛేదించారు తెలంగాణ పోలీసులు. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సీసీటీవీ పుటేజ్ ఆధారంగా లారీ డ్రైవర్, క్లీనర్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఊపిరాడకుండా చేసి ప్రియాంకను దారుణంగా హత్య చేశారు. ప్రియాంకపై నిందితులు గ్యాంగ్ రేప్కు కూడా పాల్పడ్డారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి కిరోసిన్ పోసి తగలబెట్టారు. ప్రియాంక మృతదేహాం 70 శాతం కాలిపోయింది. నలుగురు కలిసి అఘాయిత్యం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఏపీలో చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది..కలికిరి మండలం కొట్టాల గ్రామంలో పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. వీరభద్రయ్య(25) అనే నీచుడు.. గ్రామానికి చెందిన బాలికపై రేప్ చేశాడు. ఆ కృర మృగాన్ని రోడ్డుపైనే దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోస్కో చట్టం కింద కేసు పెట్టారు.
రాజస్తాన్లోరి భివాడిలో దారుణం జరిగింది. ట్రిపుల్ తలాక్ని నిరాకరించినందుకు కోడలిపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మద్య రాజస్తాన్ రాజధాని జైపూర్లో ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్లోని బంధువుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి స్లీపర్ బస్సులో తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగింది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇలా సెక్స్ కోసం మగాళ్లు మృగాళ్ల మారుతుంటే..ఈ సమాజంలో స్వేచ్ఛగా ఎలా తిరుగుతామని మహిళలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి వారికి ఉరి శిక్ష వెంటనే అమలు చేస్తే కొంతైనా మార్పు ఉంటుందని అంటున్నారు.