జీవితంపై ఎన్నో ఆశలు.. ఆశయాలతో చదువుకొని.. డాక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక రెడ్డిపై ఓ నలుగురు దొండగులు పాశవికంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచి వేసింది. అత్యాచారం చేసి వదిలేసినా ఆమె బ్రతికేదేమో.. ఆ పాపాన్ని కడిగేసుకొని కొత్త జీవితాన్ని ఏదోలా ప్రారంభించేది. అత్యాచారం చేసిన నిందితులకు జైలు శిక్ష పడేది. కానీ, ఒళ్ళు మరిచి.. ఉచ్ఛనీచాలు పక్కన పెట్టి.. తాగిన మత్తులో మృగాళ్లులా ప్రవర్తించి.. పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసి.. ఆపై లారీలో 28 కిలోమీటర్లు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు.
నిజంగా ఈ సంఘటన గురించి వింటుంటేనే.. కళ్ళంబడి నీరు కోరుతున్నది. అలాంటిది ప్రియాంక రెడ్డి ఐదు గంటలపాటు ఆ మృగాళ్ల చేతుల్లో ఎంతగా నరకం అనుభవించిందో తలచుకుంటేనే భయం వేస్తుంది. మగాళ్లు.. మద్యం తీసుకొని ఇలా మృగాళ్ళుగా మారడానికి కారణం ఎవరు.. ఎందుకు ఇలా మృగాళ్ళుగా మారుతున్నారు. ఇంట్లో వాళ్లకు పెళ్ళాం పిల్లలు లేరా..
మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి అత్యాచారం.. హత్య చేసిన నలుగురు నిందితులపై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. కొంత మంది వాళ్ళను ఉరితీయాలని అంటుంటే.. ఉరి తీసి వాళ్లకు ఈజీగా చావును ప్రసాదిస్తే దాని వలన ఉపయోగం ఉండదని, జీవితంలో వాళ్ళు ఎవరిపై అత్యాచారాలు చేయకుండా.. మహిళలను చూస్తేనే భయపడే విధంగా చేయాలనీ అంటున్నారు.
దానికి ఒక్కటే మార్గం అని, మగాళ్లుగా చెప్పుకొని అత్యచారం చేసిన మగతనాన్ని కట్ చేయాలనీ, దాంతో పాటు ఒక కాలు ఒక చేయి తీసేయాలని అంటున్నారు. ఇలా చేస్తే.. వాళ్ళను చూసి మిగతా వ్యక్తులు మహిళల జోలికి రావడనికి భయపడతారని అంటున్నారు. కొంతమంది నెటిజనులైతే వాళ్ళను కూడా బ్రతికుండగానే పెట్రోల్ పోసి తగలబెట్టాలని, అప్పుడే మిగతావాళ్లకు బుద్ధివస్తుందని అంటున్నారు. అటు సినీ ప్రముఖులు కూడా దీనిపై చాలా కోపంగా ఉంటున్నారు.