రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ సంచలనంగా మారిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. ప్రియాంక రెడ్డి కిడ్నాప్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది ? ఆమెను ఎలా హత్య చేశారు ? ఆమె అత్యాచారానికి గురయ్యారా ? ఇలాంటి అంశాలపై విచారణ చేసినప్పుడు పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మాయి నిజాలు బయట ప‌డ్డాయ‌ట‌. పోలీసుల అంచనా ప్రకారం ప్రియాంక రెడ్డి కిడ్నాప్ అయిన తర్వాత చనిపోయే ముందు వరకు దండుగుల‌ చేతుల్లో చిత్రహింసలకు గురై ఉంటారని భావిస్తున్నారు.

 

ఆమెను కిడ్నాప్ చేసిన అనంతరం ఒకరిపై ఒకరు అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. అక్కడ దొరికిన వస్తువులు కూడా పోలీసుల అనుమానాల‌ను బలపరుస్తున్నాయి. స్కూటీ నిలిచిన వెనుక లో దుస్తులు.. చెప్పులు.. బ్యాగ్.. గుర్తింపు కార్డు.. ఆమె నిత్యం ధరించే చున్నీ లాంటివి ఉండటం.. వాటి వద్దే మద్యం సీసాలు దొరకటంతో ఆమె అత్యాచారానికి గురై ఉంటారని భావిస్తున్నారు. ఆమెను ముందుగా మాటల్లో నెట్టి.. ఆ త‌ర్వాత ప‌క్క‌కు లాక్కు వెళ్లి... ఆ తర్వాత లారీలు అడ్డుపెట్టి బలవంతంగా అత్యాచారం చేసిన అనంతరం ఆమెను చంపి షాద్‌న‌గర్ వైపు తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అంచనా.

 

అత్యాచారం చేశాక ఆమెను అలాగే వదిలేస్తే అందరూ ప్రమాదంలో పడతారని భావించి... ఆమె డెడ్‌బాడీని పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు తెలుస్తోంది. ఇక ప్రియాంక బుధవారం రాత్రి 9 గంటల 44 నిమిషాలకు స్విచ్ ఆఫ్ అయిన‌ట్టు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మరణించి ఉండ‌వ‌చ్చంటున్నారు. ఐదు గంటల పాటు ఆమె నరకాన్ని చవి చూసి ఉంటారని భావిస్తున్నారు. ప్రియాంక తలపై చిన్న దెబ్బ ఉన్నట్లు గుర్తించారు.

 

ముందుగా ఆమె గొంతు పిసికి చంపి ఉంటార‌ని అంచ‌నా. ఇక ఆమెను బాడీని త‌గ‌ల పెట్ట‌డంతో అత్యాచారం జ‌రిగింద‌న్న‌ది ఖ‌చ్చితంగా తెలియ‌క‌పోయినా అక్క‌డున్న ప‌రిస్థితులు. వాతావ‌ర‌ణం మాత్రం ఆమెపై అత్యాచారం జ‌రిగింద‌నేందుకు ఆధారాలుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: