తాజాగా ప్రియాంక రెడ్డికి జరిగిన అన్యాయం అందరిలోనూ బాధ కలిగిస్తుంది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యపై టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందించారు. తాజాగా ప్రియాంక రెడ్డి హత్య ఘటన పై టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించడం జరిగింది. ప్రియాంక రెడ్డి హత్య ఘటన తమ గుండెలను పిండి వేసిందింది అని ఆవేదనా వ్యక్తం చేయడం జరిగింది. అందరికి నివాసానికి యోగ్యమైన భాగ్యనగరంలో ఇలా జరగుతుందనుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లరి నరేశ్, అల్లు శిరీశ్, సుధీర్బాబు, వివి వినాయక్, కీర్తి సురేశ్, మెహ్రీన్ పిర్జాదా, లావణ్య త్రిపాఠి, రాశిఖన్నా, స్మిత తదితరులు ట్విటర్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక అమ్మాయిని ఇంత కఠినంగా చంపుతారా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య యావత్ తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలిచి వేస్తుంది. ఆమెను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శిక్ష పడాలని అటు పాలతో పాటు ఇటు సినీ ప్రముఖులు కూడాకోరుతున్నారు. ఇలాంటి నేరాలు చేసిన వారిని ఉరి తీయాలని, అత్యవసర సందర్భాల్లో ఆడపిల్లలు పోలీసుల సాయం కోరాలని, లైవ్ లొకేషన్ యాప్స్ షేర్ చేయాలని సలహాలుఇవ్వడం జరిగింది.
ఈ దారుణ ఘటనపై ప్రముఖ నటుడు సుధీర్ బాబు, అల్లరి నరేష్, మెహ్రీన్ పీర్జా, లావణ్య త్రిపాఠి, కీర్తి సురేష్ తదితరులు స్పందించారు. ఈ ఘోరంపై ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో అర్థం కావడంలేదని ట్విట్టర్ వేదికగా చేసుకుని పోస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రియాంక హత్య గురించి తెలియగానే తనకు బాధ, కోపం, నిస్సహాయత వంటి భావోద్వేగాలు కలిగాయని హీరో అల్లు శిరీష్ తెలియచేయడం జరిగింది.
ప్రియాంక కేసులో న్యాయం జరుగుతున్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు ప్రముఖులు. ఆపద సమయంలో పోలీసుల సహాయం తీసుకోవాలని హీరో సుధీర్బాబు సూచించడం జరిగింది. లైవ్ లొకేషన్ యాప్స్, అత్యవసర ఫోన్ కాల్ ఆప్షన్స్ తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలన్నారు. ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం జరిగింది.