ఎన్నో మలుపు తీసుకున్న కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు ఉప ఎన్నికల తో మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్బంగా బీజేపీ నాయకుల మీద జేడీఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హెచ్.డీ. కుమారస్వామి విరుచుకుపడుతున్నారు. ఔను... నేను స్టార్ హోటల్ లో ఉన్నాను. అయితే మీ లాగా రూంలో రాసలీలలు చెయ్యడానికి మాత్రం కాదులే, మాకు వేరు పనులుంటాయి అంటూ మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి బీజేపీ నాయకులకు చురకలు అంటించారు. ఇటీవల ఓ బీజేపీ ఎమ్మెల్యేల రాసలీలల వీడియో వైరల్ అయిన విషయం మన అందరికి తెలుసు, తనకు అలంటి పాడు బుద్దులు లేవని మాజీ సీఎం కుమారస్వామి బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డాడు.

 

మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే అరవింద లింబావలి చేసిన ఘనకార్యాల వీడియోలు బయటకు రాకుండా వాటిని సీజ్ చేయించిన ఘనత ఆయనదే అని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. ఇలాంటి రాజకీయ నాయకులు ఆ తన మీద ఆరోపణలు చేసేది అని ప్రశ్నించారు.అనర్హత ఎమ్మెల్యే విశ్వనాథ్ చేసిన ఆరోపణలపై మాజీ సీఎం కుమారస్వామి స్పందించారు. తాను ప్రభుత్వ బంగ్లాల్లో నివాసం ఉండలేదని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తన సొంత ఇల్లు జేపీ నగర్ లో ఉందని, తన ఇల్లు విధాన సౌధకు దూరంగా ఉండటం వలనే మద్యాహ్నం భోజనం చెయ్యడానికి, విశ్రాంతి తీసుకోవడానికి తాను ప్రైవేట్ హోటల్ లో ఉండవలసి వచ్చిందని మాజీ సీఎం కుమారస్వామి వివరణ ఇచ్చారు.

 

తాను విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే హోటల్ గది తీసుకున్నానని, రాత్రి అక్కడ రాసలీలలు సాగించడానికి మాత్రం కాదని మాజీ సీఎం కుమారస్వామి బీజేపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు. హోటల్ లో రాసలీలలు సాగించడానికి మీకంటే సిగ్గు మానం లేదు, మాకు సిగ్గు మానం, మర్యాదా లేదా ? అందుకే అలాంటి వాటికి తాము దూరంగా ఉంటున్నామని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

 

తన మీద ఆరోపణలు చేసిన విశ్వనాథ్ ఎన్నోసార్లు జేపీ నగర్ లోని తన ఇంటికి వచ్చి తనతో పాటు భోజనం చేశాడని, అయితే ప్రజల సమస్యలు పరిష్కారం చెయ్యాలని ఏరోజు అతను మా ఇంటికి రాలేదని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. హెచ్.డీ. కుమారస్వామి సీఎంగా ఉన్న సమమంలో ఫైవ్ స్టార్ హోటల్ లో ఎక్కువ సమయం గడిపారని, తాను ఎన్నోసార్లు సీఎంను కలవడానికి తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ కు వెళ్లిన సమయంలో తరువాత రండి, రేపు రండి అంటూ సమాధానం ఇచ్చారని, సామాన్య ప్రజలను దగ్గరకు రానివ్వకుండా ఆయన విలాసవంతమైన జీవితం గడిపారని ఆరోపణలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: