పొన్ మాణిక్య వేల్ విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రత్యేక అధికారి ముందుకు సాగుతున్నారు. భారత దేశానికి రెండు విగ్రహాలను ఆ్రస్టేలియా నుంచి తెప్పించేందుకు సిద్ధం అయ్యారు. తమిళ పాలకుల నుంచి స్పందన కరువు కావడంతో చాకచక్యంగా విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఆ విగ్రహాలను ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చేశారు. విగ్రహాల స్మగ్లర్ల లు ‘పొన్ మాణిక్య వేల్’ఈ పేరు వింటే చాలు వారి గుండెల్లో దడ బయలు దేరుతుంది. ఆయన ఐజీగా స్మగ్లర్లకు విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం ముచ్చమటలు పట్టించారు. దేశ విదేశాల్లో ఉన్న విగ్రహాలను ఇక్కడికి రప్పించే దిశగా ముందుకు సాగారు. తనకు అప్పగించిన బాధ్యతల్లో ఏ మాత్రం తగ్గబోనని మరో మారు చాటుకున్నారు.
కోర్టు ఆయన పదవీ కాలం ముగిసినా ఇంకా ఆయన్నే ప్రత్యేక అధికారిగా నియమించింది. ప్రత్యేక అధికారిగా ఆయన నియమితులైనా పాలకుల నుంచి సాయం మాత్రం కరువైంది. అయితే, తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో ఆయన ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు నిదర్శనం తాజాగా 4 కోట్ల రూపాలకు సంబంధించిన విలువగల రెండు విగ్రహాలను పాలకుల నుంచి సహకారం లేకపోవడంతో ఏకంగా విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించి భారత్కు రప్పించడం ఒక గొబ్బ విశేషం.
తిరువడై మరుదూర్ అనే గ్రామం తిరునల్వేలి జిల్లా వీరనల్లూరు సమీపంలో ఉంది. ఇక్కడ మూంగీశ్వర ముడయార్ ఆలయాన్ని పాండ్య రాజుల హయంలో నిర్మించారు. 1995లో ఈ ఆలయంలోని రెండు ద్వార పాలకుల విగ్రహాలు అపహరణకు గురయ్యాయి. ఈ కేసు విషయంలో పోలీసులు కూడా వారి వల్ల చేత కాదని చేతులెత్తేశారు ,కానీ దీనిపై రహస్యంగా పొన్ మాణిక్య వేల్విచారణ చేపట్టి, ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో గుర్తించారు. స్మగ్లర్లు లక్ష్మి నరసింహన్, అశోకన్లు తన అనుచరుల ద్వారా ఇండో నేపాల్ ఆర్ట్ గ్యాలరీకి తరలించినట్టు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాలోని ఓ ప్రముఖ గ్యాలరీలో ఉంచినట్టు గుర్తించారు.
ఈ విగ్రహాల విలువ రూ.4 కోట్ల 98 లక్షలు. ఈ విగ్రహాలు తమిళనాడులో చోరీ చేసి, ఇటీవల పొన్ మాణిక్య వేల్ ఆ్రస్టేలియాకు తరలించినట్లు ఆ గ్యాలరీకి హెచ్చరికలతో కూడిన లేఖను పంపించారు. ఆ గ్యాలరీ వర్గాలు స్పందించి, భారత్కు తీసుకెళ్లాలని సూచించినా, వాటిని ఇక్కడికి తీసుకు రావడంలో పాలకుల సహాకారం అన్నది పొన్ మాణిక్య వేల్కు కరువైంది. దీంతో వ్యూహాత్మకంగా, పట్టువదలని విక్రమార్కుడిలా మాణిక్య వేల్ వ్యవహరించారు.దీనిపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.ఆయన స్పందించి ఆ విగ్రహాలను ఆస్ట్రేలియా ప్రధాని ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదికి అప్పగించేందుకు నిర్ణయించారు.జనవరిలో ఆ్రస్టేలియా నుంచి ఈ విగ్రహాలు ఢిల్లీకి రానున్నాయి.