వైఎస్సార్సీపీ ఎంపీ విజయరెడ్డి వ్యవసాయ రుణాలు కేవలం రైతుల సిబిల్ స్కోర్ ప్రాతిపదికపైనే మంజూరు చేయాలంటూ విధించిన షరతును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.ఈ గురువారం ఈ అంశంపై విజయసాయిరెడ్డి రాజ్యసభ జీవో అవర్లో మాట్లాడుతూ... ప్రభుత్వ రంగ బ్యాంకులు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ఎల్లప్పుడూ మెరుగైన పాత్ర పోషిస్తుంటాయని అన్నారు. రైతులకు వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించి తగిన వ్యవధిలో రుణం లభించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.అయితే ఇటీవల రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన వ్యవసాయ రుణాల మంజూరీకి సంబంధించి మార్గదర్శకాలలో సిబిల్ స్కోర్ అత్యంత ఆక్షేపణీయమైనదని పేర్కొన్నారు.
వ్యవసాయ రుణాలు కేవలం సిబిల్ స్కోర్ ప్రాతిపదికపైనే మంజూరు చేయాలన్న నిబంధన కారణంగా చాలా మంది రైతులు రుణాలు అందక కష్టాలు పడుతున్నారని ఆయన చెప్పారు. బ్యాంకులు వ్యవసాయ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు సిబిల్ నమోదైన లావాదేవీల ప్రాతిపదికన డిఫాల్టర్లుగా చూపుతూ వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని ఆయన కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు.రైతులకు ఈ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు మేలు చేయకపోగా. వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
75 శాతం నుంచి 80 శాతం రైతులు మన దేశంలో వ్యవసాయరంగం పూర్తిగా వర్షాధారమని.. వరదలు, వడగళ్లు, కరువు, కాటకాలు, వాతావరణంలో సంభవించే ఆకస్మిక పరిణామాల కారణంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం వల్ల రైతులు పంట నష్టపోయి.. వ్యవసాయ రుణాలు చెల్లించలేక డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నారని చెప్పారు.
ఇన్ని కష్టాలను ఎదుర్కుంటున్న రైతులకి ఏదో ఒక సహాయం చేయడం మానేసి వారిని ఇంకా కష్టాలపాలు చేస్తున్నారు అని పేర్కొన్నారు . రైతులకు వ్యవసాయ రుణాలు సిబిల్ స్కోర్ ఆధారంగా మంజూరు చేయాలన్న నిబంధంగా ఏ విధంగా సహేతుకం అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ నిబంధనను తక్షణమే తొలగించాలని.. విశ్వసనీయత ప్రాతిపదికపైనే బ్యాంకులు రైతులకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.