ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష టీడీపీ జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం పై ఏదో ఒక ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, కీలక నిర్ణయాలు అన్నింటిపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనదైన శైలిలో విమర్శలు చేస్తారన్న  విషయం తెలిసిందే. మరోసారి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు రాజధాని నిర్మాణం కోసం గత టీడీపీ  ప్రభుత్వం చేసిందేమీ లేదు అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్ర రాజధాని అమరావతి పై అంత ప్రేమ ఉంటే ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు ఇల్లు కట్టుకో లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. 

 

 

 

 రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇల్లే  కట్టుకోలేని చంద్రబాబు రాజధాని అసలు ఏం నిర్మిస్తారు అంటూ విమర్శలు గుప్పించారు. నేడు  తాడేపల్లిలోని వైసిపి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టిడిపి పై ఇలాంటి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధాని అమరావతి పేరు చెప్పి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక మోసాలకు  పాల్పడ్డారంటూ అంబటి విమర్శలు చేసారు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో ఏ దేశం వెళితే ఆ దేశ రాజధాని తరహాలో అమరావతిని  నిర్వహిస్తామంటూ అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులపై రియల్ ఎస్టేట్ వ్యాపారి లపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాయంగా కేసులు పెట్టించారంటూ  అంబటి వ్యాఖ్యానించారు. అందుకే వాళ్ళందరూ కడుపుమంటతో నిరసన తెలిపారు అని అంబటి విమర్శలు చేసారు. 

 

 

 

 అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ  రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో వివాదం చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని  ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెల శివప్రసాదరావు మరణం,  ఇసుక సమస్య విషయంలో చంద్రబాబు ఇలాంటివే  చూశారంటు  విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతిని  చంద్రబాబు ఒక బ్రమరావతి గా మార్చడం సహా ... ఎలాంటి అభివృద్ధి చేయకుండా రాజధానిలో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. అయితే దీనిపై విచారణ కమిటీ వేస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టి చంద్రబాబు మాత్రం పది రూపాయలు ఖర్చు పెట్టాను అంటూ చూపించారని ఆరోపించారు . రాజధాని అమరావతిని అద్భుతమైన రాజధాని అంటూ చంద్రబాబు చెబుతున్నారని అయితే శాశ్వత బిల్డింగులు మాత్రం ఎక్కడ ఉన్నాయి... అసలు అమరావతిలో చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో ఏమి కట్టించారు అంటూ నిలదీశారు ఎమ్మెల్యే అంబటి. గతంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ వల్లే నల్ల రిబ్బన్ బ్యానర్లు ఫ్లెక్సీలతో నిరసన తెలిపిన చంద్రబాబు... ఇప్పుడు మాత్రం ఎందుకు ఇంకా నమస్కారం పెట్టారు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని సాష్టాంగ నమస్కారాలు  పెట్టిన ప్రజలు చంద్రబాబును నమ్మే ప్రసక్తి లేదని హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: