మనదేశంలో ఆంధ్ర, తెలంగాణ, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశం అన్న తేడా లేకుండా మృగాళ్లు తమ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు. ఆడది అంటే అమ్మతో సమానం... ఆదిపరాశక్తి అన్న విషయం మర్చిపోయి... చట్టాలంటే ఏమాత్రం భయం లేకుండా హ‌త్యాచారాలకు పాల్పడి మరి వారిని అతి కిరాతకంగా చంపేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లాలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని టీనేజ్ వయసులో ఉన్న నలుగురు మృగాళ్లు ఎలా హ‌త్యాచారం చేశారో ? చూశాం.. ఈ దారుణ సంఘటన తో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా విస్తుపోయాయి.

 

అయితే ఇప్పుడు ప్రియాంక తరహాలోనే తమిళనాడులోని కాంచీపురం లో రోజా అనే యువతి హ‌త్యాచారానికి గురైంది. గత శనివారం కనిపించకుండా పోయిన రోజా గురువారం కాలిన గాయాలతో ముళ్లపొదల్లో శవమై కనిపించింది. ఆమె మృతి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆండిసిరువలూర్‌ గ్రామానికి చెందిన భూపతి కుమార్తె రోజా (20) చెన్నై సమీపంలోని శ్రీపెరంబదూరులో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. 

 

గత శనివారం విధులకు వెళ్లిన రోజా ఇంటికి తిరిగి రాలేదు. రోజా కోసం తీవ్రంగా గాలించిన ఆమె కుటుంబ సభ్యులు రెండు రోజులకు కూడా ఆచూకీ లభించకపోవడంతో... స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పెరంబందూరు సమీపంలో రోజా మృతదేహం కనిపించింది. ఆమె మృత‌దేహం ఓ కొయ్య‌కు వేలాడుతూ ఉంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందింది రోజాయే అని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమెను కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

 

రోజా ఒంటి కాలిన గాయాలు ఉండటంతో.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజాపై దండుగులు సామూహింగా అత్యాచారం చేశాక‌.. ఆమెను అంత‌మొందించి ఉంటార‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రోజా మృతదేహాం లభించిన ప్రాంతం ఓ రాజకీయ నాయకుడిదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రోజా చివరిసారిగా ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న రాజేశ్‌(30) మాట్లాడుతూ కనిపించిందని తేల‌డంతో పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకుని విచారిస్త‌న్నారు. ఏద‌మైనా రెండు రోజుల తేడాతో ఇద్ద‌రు యువ‌తులు ఒకే రీతిలో హ‌త్యాచారానికి గుర‌వ్వ‌డంతో యావ‌త్ దేశం దిగ్భ్రాంతిలో ఉంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: