రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలకు అందమైన అమ్మాయిలను ఎర వేసి వారు అమ్మాయిలతో రాసలీలల్లో మునిగి తేలుతున్నప్పుడు వీడియోలు తీసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న హాని ట్రాప్ ముఠాను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లో హానీట్రాప్‌ ముఠా ఎంత సంచలనం క్రియేట్ చేసిందో ? ఇప్పుడు కర్ణాటకలో అదే తరహాలో సంపన్నులు వ్యాపారవేత్తలతో పాటు చివరకు రాజకీయ నాయకులకు సైతం అమ్మాయిలను ఎర వేసి వారు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

 

ఉత్త‌ర‌ కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే కు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో గుర్తించిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ ముఠా ఇద్దరు అందమైన మహిళల ద్వారా రాజకీయ నాయకులను ముగ్గులోకి దించి వారు ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియో తీసి కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోంది. 

 

ఈ క్ర‌మంలోనే ఉత్త‌ర క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ ఎమ్మెల్యే ద‌గ్గ‌ర‌కు ఈ ముఠా ఓ మోడల్‌ను పంపించారు. ఆమె అతడిని ముగ్గులోకి దించి సెక్స్‌ చేసేలా ప్రేరేపించింది. ఆ నేత ఆమెతో రాసలీలలు కొనసాగిస్తుండగా ముఠా సభ్యులు రహస్యంగా వీడియో రికార్డ్ చేశారు. ఆ త‌ర్వాత వాళ్లు ఆ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి డ‌బ్బులు ఇవ్వాల‌ని బెదిరించారు. వాళ్ల వేధింపులు ఎక్కువ అవ్వ‌డంతో విసిగిపోయిన స‌ద‌రు ఎమ్మెల్యే క్రైం బ్రాంచ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

 

వాళ్లు నిఘా వేయ‌డంతో ఈ ముఠా గుట్టు ర‌ట్టు అయ్యింది. పోలీసులు ఆ ప్లేస్‌కు చేరుకునే స‌రికి అసుల నిందితులు త‌ప్పించుకున్నారు. రాజ‌కీయ నేత‌లు, వ్యాపార వేత్త‌లు, సంప‌న్నులు ఇతర ప్రాంతాల‌కు వెళ్లి హోట‌ల్లో బ‌స చేసిన‌ప్పుడు ఈ ముఠా అమ్మాయిలను ఎరగా వేసి వారి రాసలీలలను రికార్డ్ చేస్తోందని పోలీసులు తెలిపారు. వీరి చేతిలో ఎంతమంది మోసపోయారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: