వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు  చంద్ర బాబు అన్ని డ్రామాలాడుతున్నదని పేర్కొన్నారు వివరాల్లోకి వెళ్తే.... చంద్రబాబు  అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతి ప్రాంతాన్ని దోచుకున్న  ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ‘అమ్మో.. అమరావతి’ అంటూ గుండెలు బాదుకుంటూ  పెద్ద హైడ్రామా ఆడుతున్నారని తీవ్రస్థాయిలో  ఆయన మండిపడ్డారు. ఇక్కడ సొంత ఇల్లు కట్టుకోలేని ఆయనకు అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కులేదని ధ్వజమెత్తారు.

 

ఓటు ఇక్కడ, ఇల్లు  మాత్రం హైదరాబాద్‌లో కావాలా?.. ఇదేనా అమరావతిపై మీకున్న ప్రేమ చంద్రబాబు? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.శుక్రవారం అంబటి  గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి తరువాత రాజధాని ప్రాంతంలో విషయం ఏమీలేకపోయినా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఛలో ఆత్మకూరు, ఇసుక దీక్ష, ఇంగ్లిషు మాధ్యమాల అంశాలు అయిపోయి, ఇప్పుడు బాబు అమరావతి వరకు వచ్చారని అయన పేర్కొన్నారు .

 


రూ.42 కోట్లు రూపాయల్ని రాజధాని సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి ఖర్చు చేశారన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత రేటు పెట్టి ఏ రోడ్డు నిర్మించలేదని ఇలా ఉండరని అంబటి తెలిపారు.గరిష్టంగా రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్లు రూపాయలు   జాతీయ రహదారి నిర్మాణానికి అవుతుంది దీనికి మించి  కాదని ఆయన చెప్పారు. అలాగే, భవనాలకు చదరపు అడుగుకు రూ.1,500 ఇస్తారని, మహా అయితే రూ.2 వేలు ఇస్తారని.. కానీ, బాబు రూ.6 వేలు నుంచి రూ.11 వేలు ఇచ్చారన్నారు.

 

అమరావతిలో ఏముందని తాము చంపేశామని చంద్రబాబు అంటున్నారో తెలియడంలేదన్నారు. ఒక్క శాశ్వత భవన నిర్మాణమూ కూడా ఈ ఐదేళ్లలో  కట్టలేదని గుర్తుచేశారు. కాగా, అంబటి రాంబాబు రాజధానిలో లోకేశ్‌ను తుక్కుతుక్కుగా ఓడించినా చంద్రబాబుకు జ్ఞానోదయం కలగలేదని  చెప్పారు . అమరావతి భూసమీకరణలో అందరినీ వేధించినందునే బాధితులు గురువారం చెప్పులు, రాళ్లు విసిరి తమ నిరసన తెలిపారన్నారు.మీరు చేసిన పనికి తగిన శాస్త్రి జరిగింది బాబు అంటూ అంబటి పేర్కొన్నారు   కాగా, రాజధానిపై తాము స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అంబటి తెలిపారు. అవినీతికి తావులేకుండా ప్రజా రాజధాని నిర్మిస్తామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: