ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఆడవారిపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.  అభం శుభం తెలియని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. ఇక వెటనరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బుధవారం శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద గల టోల్ ప్లాజా సమీపంలో ప్రియాంక రెడ్డి కి చెందిన స్కూటీ పంక్చర్ ఐయ్యిందనీ, పక్కనే ఉన్న షాప్ దగ్గర పంక్చర్ వేయించి తీసుకొస్తామని చెప్పి ఆమెను పక్కదారి పట్టించి దారుణంగా అత్యాచారం జరిపి చంపేశారు.  కామాంధుల కర్కశానికి ఓ వైద్యురాలు బలైపోయింది.  నింధితులను 24 గంటల్లోపే పోలీసులు పట్టుకున్నారు.  ఇక పోలీసులు చెప్పిన దారుణమైన విషయాలు ప్రతి ఒక్కరికీ కన్నీరు తెప్పించేలా ఉన్నాయి. నింధితులు తెలిపిన ఛేదు నిజాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ రక్తం ఉడికేలా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.  

 

బాధితురాలు తన స్కూటీ కోసం వేచిచూస్తున్న ప్రదేశం నుంచి మహ్మద్‌ ఆరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్‌లు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు.  ఆ సమయంలో ప్రియాంక సహాయం చేయండి అన్నా కూడా హైవే పై వాహనాల శబ్దానికి ఆమె అరుపులు అరణ్యరోదన అయ్యాయి.  ఆమె అరుపులు మొదలు పెట్టడంతో ముగ్గురు మరింత పైశాచికత్వానికి తెగబడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేయడం మొదలు పెట్టారు.  స్కూటీ తీసుకు వెళ్లిన శివ కూడా తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే ఆమె అరవకుండా దుండగులు బాధితురాలికి బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకానికి పాల్పడ్డారు.  మద్యం మత్తులో ఉన్న దుండగులు ఆమెపై లైంగికదాడి చేశారు. బాధితురాలు ప్రతిఘటించకుండా మద్యాన్ని బలవంతంగా ఆమె నోట్లో పోశారు. 

 

రాత్రి 10.20 గంటలవరకు ఈ రాక్షసకాండ కొనసాగించారు.  నోరు, గొంతు నొక్కడంతో ప్రియాంక చనిపోయింది..కానీ చనిపోయిన శవాన్ని సైతం ఈ దుర్మార్గులు వదల్లేదు. సుమారు 45 నిమిషాలు నిందితులు వైద్యురాలిపై అత్యాచారం చేస్తూ రాక్షనాందం పొందినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణం ఎంతగా కొనసాగించాంటే.. నిందితులు మార్గమధ్యలో మృతదేహంపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా తేల్చారు. ఘటనాస్థలిలో పోలీసులు మృతురాలి లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: