వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రియాంక రెడ్డి దారుణ హత్యకు దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మద్యం మత్తులో ఉన్న నలుగురు కామాందులు పథకం ప్రకారం వైద్యురాలు ప్రియాంక రెడ్డి నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారం చేసి అనంతరం దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది . కాగా ఈ దారుణ ఘటనపై సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు సైతం స్పందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రియాంక రెడ్డి హత్య కేసుపై స్పందించారు . ప్రియాంక రెడ్డి దారుణ హత్య తనను తీవ్రంగా కలచివేసిందని రోజా తెలిపింది.హత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు. ప్రియాంక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు రోజా.
ఇదిలా ఉండగా ప్రియాంకా మర్డర్ మిస్టరీ లో ఎన్నో గగుర్పాటు పొడిచే నిజాలు బయటికి వచ్చాయి. పథకం ప్రకారం స్కూటీని పంచర్ చేసిన నిందితులు ... వైద్యురాలు ప్రియాంక రెడ్డి స్కూటీని పంచర్ చేసారు. బాధితురాలు వచ్చి స్కూటీని చూశాక ఆ స్కూటీ పంచర్ అయింది అని ఆ స్కూటీని పంచర్ చేయించుకోస్తాను ఓ వ్యక్తి స్కూటీ తీసుకుని వెళ్లగా... మరో ముగ్గురు వ్యక్తులు ప్రియాంక రెడ్డిని నిర్మానుష్య ప్రదేశంలోకి లాక్కెళ్లారు. అనంతరం స్కూటీ తీసుకెళ్లిన వ్యక్తి కూడా వచ్చి జతకలిసి వైద్యురాలు ప్రియాంక రెడ్డిని చిత్రహింసలకు గురిచేశారు. నలుగురు ప్రియాంక రెడ్డి పై అత్యాచారం చేశారు. కాగా ప్రియాంక రెడ్డి అరవకుండా వారు ముక్కు నోరు నొక్కి పట్టుకోవడంతో వైద్యురాలు ప్రియాంక రెడ్డి ఊపిరాడక చనిపోయింది.
రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో ప్రియాంక రెడ్డి చనిపోగా ప్రియాంక రెడ్డి మృతదేహాన్ని లారీలో వేసుకొని 27 కిలోమీటర్ల దూరం తరలించి అక్కడ ఒక నిర్మానుష్య ప్రదేశంలో ప్రియాంక రెడ్డి మృతదేహం పై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. కాగా నిందితులను కఠినంగా శిక్షించాలని దేశ ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు.