తాజాగా హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్ పై  జరిగిన అమానుషంపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు బాగా జరగడం అందరికి తెలిసిన విషయమే కదా. షాద్‌నగర్ లో  ప్రియాంకను అత్యంత పాశవికంగా హత్య చేసిన నలుగురు నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు చేయడం మొదలు పెట్టారు.  దీనితో మహిళలు, కాలేజీ విద్యార్థినిలు.. ప్రజా, మహిళా సంఘాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు అన్ని చోట్ల. నిందితుల్ని నడిరోడ్డులో ఉరి తీయాలంటున్నారు నిరసనలు చేపట్టారు. 

 

 

మరో వైపు  ఇటు నిందితులు ఉన్న షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా స్థానికులు ధర్నాను నిర్వహిస్తున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. డాక్టర్‌పై అఘాయిత్యానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో కూడా బాగా మారు  మోగుతుంది. నిరసనల సంగతి అలా పక్కన పెడితే మహబూబ్‌నగర్, షాద్‌నగర్ బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిందితుల తరపున వాదించకూడదని లాయర్లు నిర్ణయించారు. వారికి ఎలాంటి న్యాయ సహాయం అందించొద్దని తీర్మానాలు కూడా మొదలు పెట్టారు అంటే నమ్మండి. ఒక పక్క లాయర్లు కూడా ఎవరూ కూడా వారికి సహకరించమని స్పష్టంగా తెలియజేస్తున్నారు. లాయర్ల నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేయడం గమనించ వలసిన విషయం.. మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు ప్రజలందరూ కూడా.

 

మూడు రోజుల క్రితం ఆమెను నలుగురు నిందితులు పాశవికంగా అత్యాచారం జరిపి హత్య చేయడం జరిగింది. డెడ్ బాడీని తీసుకెళ్లి షాద్‌నగర్ సమీపంలో తగుల బెట్టడం కూడా జరిగింది. పోలీసులు ఈ కేసు మిస్టరీ 48 గంటల వ్యవధిలోనే వీడింది అని తెలుస్తుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అదనపు బలగాలను అక్కడికి తరలిచి వారితో చర్చలు కొనసాగిస్తున్నారు. ఇక షాద్ నగర్ పోలీస్ స్టేషన్  ఎదుట ఉన్న చెట్టుకు నలుగురు నిందితుల బొమ్మలు పెట్టి ఉరితాడుకు వేలాడ తీశారు ప్రజలు. శనివారం నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. జడ్జి ముందు హాజరుపరిచి కస్టడీకి ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించడం జరిగింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: