డాక్టర్ ప్రియాంక రెడ్డి.. ఆమె గురించి విన్న ప్రతిఒక్కరి కంట కన్నీళ్లు.. కోపం కలిపి వస్తున్నాయి. జీవితంపై ఎన్నో ఆశలు.. ఆశయాలతో చదువుకొని.. డాక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేసి చెటాన్‌పల్లి బైపాస్‌ రోడ్డు అండర్‌ బ్రిడ్జి కింద పెట్రోలు పోసి దహనం చేశారు. అయితే అత్యంత దారుణంగా ఆమెని చంపడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. 

 

కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి కేవలం 24 గంటల్లో హత్య చేసిన నిందితులను ఛేదించారు. ప్రియాంక రెడ్డిపై నలుగురు లారీ డ్రైవర్, క్లినర్ కలిసి ఆమెపై హత్యాచారం చేసినట్టుగా నిర్దారించారు. ఆమెను కిడ్నాప్ చేసి నలుగురు కలిసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారని.. అనంతరం ఊపిరి ఆడకుండా చేసి ఆమెను చంపి అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి చంపారని పోలీసులు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆ నేరస్థులు అరెస్ట్ అయ్యారు. 

 

అయితే ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా నాయకుల నుండి రాజకీయ నాయకుల వరుకు ప్రతి ఒకరు ఆమెకు సంతాపం తెలుపుతు ఆమె తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. ఆ నీచులను ఒదిలే ప్రసక్తే లేదు అని, ఖచ్చితంగా శిక్ష విధిస్తాం అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. 

 

దీంతో కట్టలు తెంచుకున్న కోపంతో నిరసనకారులు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్, పోలీసులపై చెప్పులతో దాడి చేశారు. దీంతో నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అందరిని అక్కడినుండి తరిమేశారు. కాగా ప్రస్తతం షాద్‌నగర్ లో తీవ్ర ఉద్రిక్తతగా మారింది. ఆ మానవ మృగాలను మాకు అప్పగించండి మాపై కేసు పెట్టండి అంటూ పోలీసులపై జనాలు విరుచుకుపడుతున్నారు. చంపేస్తాం ఆ గబ్బు నాయిళ్ళను.. మీరు ఏమి చెయ్యలేరు మేము అయినా చేస్తాం అంటూ నిరసనలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: