జన నాయకుడు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ధీమా. జనం మెచ్చిన నాయకుడిగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జనం మెచ్చే పాలనను అందిస్తున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో కీలక నిర్ణయాలతో  రాష్ట్ర ప్రజలందరికీ సుపరిపాలన అందించే దిశగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలి అంటూ నినదించేంతగా  తన వినూత్న పథకాలు కీలక నిర్ణయాలతో ప్రభావితం చేస్తున్నాడు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే రాజ్యపాలన మరోసారి రాబోతుంది నమ్మిన రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ జగన్ పాలన సాగిస్తున్నారు.

 

 

 

 కాగా  జగన్ ఆరు నెలల పాలనలో ఎన్నో అద్భుత పథకాలు  మరెన్నో సంచలన నిర్ణయాలు . ఎన్నో సంక్షేమ పథకాలకు ఊపిరి పోశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. కాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏకంగా ప్రతిపక్ష నేత అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో మంచి చేస్తున్నప్పుడు దాన్ని సమర్పించాల్సింది  పోయి చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు వల్లభనేని వంశీ. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెరుగైన పాలన అందిస్తున్నారని వల్లభనేని వంశీ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.

 

 

 

 ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నందుకు గాను  చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలనకు  రాష్ట్ర ప్రజల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమవుతుండట కాక ఇటు ప్రతిపక్ష నేతలు సైతం జగన్ పాలన ప్రశంసించి నట్లయింది. అయితే ఒక్క రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జగన్ ప్రవేశపెడుతున్న ఆదర్శ పథకాలకు ఆకర్షితులవుతున్నారు. ఇక ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం మాకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సీఎం కావాలంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: