మున్సిపల్‌ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది జనవరి చివరివారం లేదా ఫిబ్రవరి తొలి వారంలో రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్‌ కార్పొరేషన్లకు  ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ తేదీ నుంచి దాదాపు 18–20 రోజుల వ్యవధిలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే అవకాశముంది. ఈ  శుక్రవారం హైకోర్టు వార్డుల విభజన, రిజర్వేషన్లను 73 మున్సిపాలిటీల్లో ప్రకటిస్తూ ప్రభుత్వం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేస్తూ  తీర్పు వెలువరించింది.

 

అంతే కాగా  హైకోర్టు మళ్లీ వార్డుల విభజనకు ముసాయిదా ప్రకటన జారీచేసి వారం పాటు అభ్యంతరాలు స్వీకరించాలని, ఆ తర్వాత వారంలోగా ఈ అభ్యంతరాలు పరిష్కరించి వార్డుల విభజనకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను జారీ చేయాలని  సూచించింది.ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు వార్డుల విభజన ప్రక్రియను 7 రోజుల్లో పూర్తి చేయాలని  పేర్కొంటున్నాయి. దీని  ప్రకారం ఈ ప్రక్రియను 14 రోజుల్లో పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. 

 

 కాగా పురపాలికలు  వార్డుల విభజన అనంతరం ఎన్నికలు జరగాల్సి ఉన్న 141 పురపాలికల్లో రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియను చేపట్టనున్నాయి. తొలుత  ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీగా ప్రకటించనుంది. మున్సిపాలిటీలు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించేందుకు  ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నాయి. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నాయి. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోగా వార్డుల వారీగా రిజర్వేషన్లను ప్రకటిస్తూ నోటిఫికేషన్లను జారీ చేయనున్నాయి.

 

దీని  రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం పోలింగ్‌ కేంద్రాల జాబితాలను ప్రకటించనుంది.  దాదాపు ఈ ప్రక్రియలన్నీ పూర్తికావడానికి  నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా ముగించాలని  భావిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలు ముగిస్తే మరో 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో మరెలాంటి ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఇక మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరిలోగానే మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: