మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని షాద్ నగర్ టోల్ గేట్ ఏరియా ప్రాంతంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతం మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా అతి పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన డ్యూటీ అనంతరం స్కూటీ ని టోల్ గేట్ వద్ద పార్క్ చేయగా, నలుగురు నిందితులు ఆ విషయాన్ని గ్రహించి, అనంతరం దానికి ఒక టైర్ పంక్చర్ చేయడంతో పాటు దాని పంక్చర్ మేము వేస్తామని మాయమాటలు చెప్పి ప్రియాంకను కొంత దూరం తీసుకెళ్లి, ఆపై ఆమెపై ఎంతో క్రూరంగా బలాత్కారం చేసి కాల్చి బూడిద చేసిన ఘటన నిజంగా అందరిని ఎంతో కలచి వేసింది. 

 

అయితే ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన నలుగురిలో ముగ్గురు యువకులు 23 ఏళ్ళ వయసు గల వారవడం అందరిని ఎంతో విస్మయానికి గురి చేసే విషయం. ఇక ఆమెను దహనం చేసిన అనంతరం ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లి దాక్కోవడం జరిగింది. అయితే అక్కడి సిసి కెమెరాల్లోని దృశ్యాలను బట్టి జరిగిన దారుణంలో నిందితులు ఎవరు అనేది తెలుసుకోవడంలో పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి వారిని వెనువెంటనే పట్టుకుని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 

 

ఇక నిన్న పట్టుకున్న ఈ నిందితులను, మీడియా ముందుకు ప్రవేశపెట్టనప్పటికీ, వారి మొహాలకు నల్ల మాస్క్ లు కట్టి తీసిన ఫోటోను మీడియాకు రిలీజ్ చేసారు ఎస్పీ సజ్జనార్. కాగా నేడు వారు నలుగురు కోర్టు ముందు హాజరైన ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాలలో ఎంతో వైరల్ అవుతున్నాయి. కాగా ఆ నలుగురు నిందితులు మాత్రం పోలీసుల ఎదుట, తాము ఆ నేరాన్ని కావాలని చేయలేదని, మద్యం సేవించిన క్షణికావేశంలో చేశామని వేడుకోవడం జరిగిందట. అతి పిన్న వయసులోనే తాగుడు అలవాటుకు బానిస అవడంతో పాటు, దారుణంగా ఒక యువతి జీవితాన్ని ఛిద్రం చేసిన అటువంటి నీచులను కనికరించేది లేదని, వారికి ఎట్టిపరిస్థితుల్లో కఠిన శిక్ష పడేలా చూస్తాం అని పోలీసులు చెప్తున్నట్లు సమాచారం.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: